31, డిసెంబర్ 2010, శుక్రవారం

శ్రీ క్రిష్ణ కమిటీ ఏం చెప్పొచ్చు !!

తెలంగాణా వస్తుందనీ, రాదనీ, ఇది ఒట్టుట్టి కమిటీ అనీ రక రకాల ఊహాగానాలూ, రాజకీయ ఎత్తుగడలూ జనవరి 6 న రిపోర్టు బహిర్గతం అయ్యే వరకూ సాగుతూనే ఉంటాయి.


సరే కమిటీ ఏం చెప్పడానికి అవకాశం ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ కమిటీ ఒక నిర్ణయాన్ని వెలువరించదు. కొన్ని పరిష్కార మార్గాలనీ, వాటి లోటు పాట్లనీ చెప్పి ప్రభుత్వ నిర్ణయానికి కావలిసిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. తద్వారా ఏదో ఒక పరిష్కార మార్గం వైపుకినడిపించగలిగే అవకాశం ఉంది. స్థూలంగా ఉన్న పరిష్కార మార్గాలు 3:
  1. తెలంగాణా ఇవ్వడం
  2. సమైఖ్యాంధ్రప్రదేశ్ ని కొనసాగించడం
  3. కొన్ని అంశాల (రాయలసీమ, హైదరాబాదు, నీటి వనరులు, ఉద్యోగులు etc.. )పరిష్కారం తరువాత తెలంగాణా ఇవ్వడం
నా దృష్టిలో 3వ మార్గం వైపుగా కమిటీ రిపోర్టు ఉండే అవకాశం ఉంది. అంటే తెలంగాణా ఇవ్వడానికి అంగీకరిస్తూనే, కొన్ని కీలక మైన అంశాలని ఏవిధంగా, ఎంత సమయంలోపు ఎలా పరిష్కరించాలో సూచించి ఆ తరువాత తెలంగాణా ఇవ్వొచ్చు అనే పరిష్కారం వైపు కమిటీ రిపోర్టు మొగ్గు చూపే అవకాశం ఉంది.


2009 డిసెంబరు 10వ తారీఖున ఒక కాంగ్రేస్ వాది కాంగ్రేస్ పార్టీకి సమర్పించిన ఒక నివేదికని నా ఆంగ్ల బ్లాగులో పొందు పరిచాను. చూడాలంటే ఇక్కడ నొక్కండి.

27, నవంబర్ 2010, శనివారం

KCR కాంగ్రేస్ ని బలపర్చమని చెప్పడంలో మర్మం ఏంటి?

మామూలుగా అందర్నీ దుమ్మెత్తిపొసి, భూస్థాపితం గావించే KCR కాంగ్రేసుని బలోపేతం చెయ్యమని ఎందుకు చెప్పాడని అందరికీ సందేహం వచ్చింది. దీని మీద రకరకాల విశ్లేషణలు మీడియాలోనూ, బ్లాగుల్లోనూ వచ్చాయిగానీ నాకయితే సరైన సమాధానం దొరకలేదు. ఏమై ఉంటుంది?


KCR కి కావలిసింది తెలంగాణా రాష్ట్రం. మరట్లాంటప్పుడు కాంగ్రేసుని బలోపేతం చేయడం KCR కి ఎందుకు పనికొస్తుంది?


మీకేమైనా అర్థమయితే చెప్పండి ప్లీజ్..

18, నవంబర్ 2010, గురువారం

జయహో జయలలిత: శభాష్ సుబ్రమణ్య స్వామి: పాపం మన్మోహన్


2G స్కాము లో చివరికి రాజా తన పదవి వదులుకోవడం కొంతవరకూ సంతోషించవలసిన విషయమె. అసలన్ని ఆరోపణలు వస్తున్నా ఇంత కాలం పదవిలో ఉండగలగడం మాత్రం చాలా ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో మాత్రం కరుణానిధీ, రాజా వంటి వాళ్ళ మొక్కవోని దీక్షా, పట్టుదలా మొదలైన వాటిని బహుశా భవిష్యత్తులో పాఠ్యాంశాలుగా చేర్చవచ్చేమో!
 


సొంత పార్టీలో మాత్రం, కాంగ్రేస్ ఈ మధ్య కొంచెం బానే స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది. శశి థరూర్, అశోక్ చవాన్, సురేష్ కల్మాడి విషయంలో జాప్యం లేకుండా తీసుకొన్న నిర్ణయాలు కొంతవరకూ అభినందిచదగ్గవే. కానీ సంకీర్ణ రాజకీయాల వల్ల రాజా విషయంలో చాలా జాప్యమూ, తాత్సార ధోరణీ కనపడిందనేది బహుశా కరడుగట్టిన కాంగ్రేస్ అభిమానులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఏంటి ఒప్పుకునేది నా పిచ్చిగానీ, అట్టా ఒప్పుకుంటే అసలు వాళ్ళు కరడుగట్టిన కాంగ్రేస్ గుడ్డెద్దులెలా అవుతారు?


ఇంతా చేస్తే పాపం అనిపించేది మన్మోహనుడి విషయమే. మిగతా విషయాలెలా ఉన్నా, వ్యక్తిగత నిజాయితీలో ఉత్తముడుగా ఉన్న ప్రధాని కూడా ఈ విషయంలో పరిస్థితుల ప్రభావం వల్ల సుప్రీం కోర్టు చేతిలో మొట్టికాయలు తినవలసి రావడం.. వ్యవస్థకి మంచిదే గానీ ఆయనకి మాత్రం కొంచెం ఎక్కడో మండే విషయంలాగే ఉంది. అయినా ఈ పెద్దొళ్ళ మంటలన్నీ, వాళు రిటైర్ అయ్యాకా, పుస్తకాలు రాశాకగానీ మనకి వెలగవు.


ఈ మొత్తం విషయంలో సుబ్రమణ్య స్వామి గారి పాత్రని మాత్రం ఎంత పొగిడినా తక్కువే. మీడియా పాత్ర కూడా తక్కువేంగాదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి లేక పార్టీ మాత్రం జయలలిత and AIADMK. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలూ, రాజాని తీసెయ్యమనీ, ప్రధానిని తప్పుకొమ్మనీ పై పై రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటే, నిజంగా ఆ పని చేయటానికి ప్రభుత్వానికి కావలిసిన ధైర్యాన్ని ఇచ్చి చాలా బాధ్యాతయుతంగా వ్యవహరించారు.


In general.. I think the recent trend of showing at least some accountability in cases of high profile corruption is a good sign. I think it is definitely a signal that is announcing the arrival of Indian middle class..on to the political spectrum. What do you think?  

12, నవంబర్ 2010, శుక్రవారం

పెద్ద పెద్ద విప్లవాలొద్దు, మనలో ఒక చిన్న మార్పు చాలు

మన రాజకీయాల్లోనూ, వ్యవస్థలోనూ ఉన్న ఎన్నో సమస్యలూ వైవిధ్యాల గురించి అలోచనలూ భావ సంఘర్షణలూ రోజూ ఎదురవుతూనే వుంటాయి మనకు. అవినీతి, అవగాహనా రాహిత్యం, రకరకాల వివక్షలూ, అతిగా ఊహించుకుని చూసే ఆభిజాత్యాలూ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో..


నా దృష్టిలో అనేక సమస్యలకు కారణాలుగా కనిపిస్తూ, పరిష్కారాలకు అడ్డంకిగా అనిపిస్తున్న అతి ముఖ్యమైన విషయాలుగా కనిపించేవి:
  1. రాజకీయ అవినీతి
  2. సమాజంలో నాయకత్వ లోపం
  3. రాజకీయాలకీ, వ్యవస్థకీ ప్రజలు వీలైనంత దూరంగా ఉండడం
  4. మన వ్యవస్థ పనితీరులో పారదర్శకత లోపించడం
  5. ఇంతపెద్ద వ్యవస్థలో మార్పు మనవల్ల అయ్యే పనేనా అనే నిస్పృహ
ఇవేకాకుండా ఇంకా అనేక సమస్యలు ఉనాయి. అయితే పరిష్కారాలు మాత్రం ఎదో అలా కొంతమంది మేధావులు చెప్పే చిట్కాల్లా సులువుగా ఉండవు. అసలు నాదృష్టిలో సులువుగా కనిపించే మార్గం అంత నమ్మదగినదిగా అనిపించదు. అనేకనేక సమస్యలకి పైన మనం చెప్పుకున్న సమస్యలు మూలకారణాలైవుంటాయి. వీటన్నింటి పరిష్కారానికి చాలా వరకు దోహద పడగలిగే మార్పులేవైనా వుంటే వాటిని ముందుగా చేసుకొంటే వ్యవస్థలో మార్పు కొంత వేగంగా జరిగె అవకాశం ఉంది.


నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలని (Local Governments ) బలోపేతం చేయడం అటువంటి మార్గాలలో అతి ముఖ్యమైనది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ దిశగా అవసరమైన చర్యలు మొదలు పెట్టాం గానీ అనుకున్నంత పురొగతి సాధించలేదు. అందుకే రాజ్యాంగం నిర్దేశించినట్టు మొత్తం 29 అంశాల మీదా నిధులూ, విధులూ, అధికారాలు స్థానిక ప్రభుత్వాలకి నిజంగా అప్పగించే ఎటువంటి ప్రయత్నాన్నైనా సమర్ధించడం చాలా అవసరం.
     
మనమొక్కళ్ళమే ఇంత పెద్ద వ్యవస్థని మార్చగలమా అనే సందేహాల్ని కాసేపు పక్కనబెడితే, మన పరిధిలో వీలైనంత వరకూ స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కృషిచేసే ప్రయత్నాలకు మద్దత్తు నివ్వడం, స్థానిక ప్రభుత్వాల పని తీరులో వీలయినంత పార్టిసిపేషన్ చెయ్యడం చేస్తే భావితరాలు ఖచ్చితంగా మెరుగైన భారత దేశాన్ని చూడగలుగుతారు.  ప్చ్ .. డౌటే అంటారా? బానే వుంది చూద్దాం అంటారా? 

19, అక్టోబర్ 2010, మంగళవారం

వృత్తి ధర్మాన్ని మంటగలిపిన డాక్టరు-మానవత్వాన్ని పంచిన స్వీపరు

నిన్న వార్తల్లో రెండు వేర్వేరు సంఘటనలు మనసుని కలిచి వేసేవి ఉన్నాయి. ఒక దాంట్లోనేమో, ముగ్గురు అక్క చెల్లెళ్ళను (పెద్ద పాప కి మూడేళ్ళనుకుంటా!) జమ్మూ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిన తండ్రి. రాం పాల్ అనే సదరు తండ్రి ని వెదికి ఎలాగొ పోలీసులు చివరికి పట్టుకోగలిగారనుకోండి. ఇతగాడు చెప్పేదెమిటంతే, ఆ పిల్లల తల్లి ఒక వివాహేతర సంబంధం కారణంగా కొన్నళ్ళ క్రితం ఎటో వెళ్ళిపోయిందట. ఇతగాడు పిల్లల్ని పెంచలేనని వదిలించుకున్నాడట. పిల్లల్ని తిరిగి స్వీకరించడానికి ఇతగాడు ససేమీరా అంటున్నాడు. ఇక ఆ మహ తల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి పిల్లల్ని ఒక అనాధాశ్రమంలో ఉంచి తదుపరి చర్యల కోసం పాపం అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఆ స్టేషన్ లో స్వీపర్ గా పనిచేసే గురుదేవ్ సింగ్ ఈ పిల్లల్ని గమనించి, చేరదీసి, అధికారులకు తెలియచేసి, ఆ రాత్రంతా నిద్రపోకుండా వారికి సేవలు చేసారు. వృత్తిధర్మాన్నేకాదు మానవత్వాన్నికూడా నిలబెట్టిన ఇటువంటివాళ్ళే ఆదర్శప్రాయులు.


ఇక రెండో వార్త విషయానికి వస్తే, డాక్టరుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవం, ధనం బాగా సంపాదించుకున్న ఒక పిశాచి విశృంఖలత్వం మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అచేతనావస్తలో ఉన్న ఒక రోగితో లైంగిక వాంఛ తీర్చుకున్నాడట కామాంధుడైన ఈ ముంబై డాక్టరు. పవిత్రమైన వృత్తి ధర్మాన్నీ, మానవత్వాన్నీ మంట గలిపాడు.


ఈ రెండు వార్తలూ చదివింతర్వాత బాధతో నిండిన హృదయం, ఆలోచనలోతో నిండిన మనసూ తప్ప, పరిష్కారం సూచించే మెదడు  మాత్రం తాత్కాలికంగా పని చేయడం మానేసింది.

4, అక్టోబర్ 2010, సోమవారం

అయోధ్య తీర్పు - సహేతుకమైన నిర్ణయం? కొన్ని ప్రమాద సూచికలు?

తీర్పు వచ్చేసింది. భారతీయులంతా ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోతారనే నిరాశావాదులకి కళ్ళు తెరుచుకునేలా ప్రజలు స్పందించారు. అసలు తీర్పు సంగతి అటుంచితే, మన సమాజం 1992 నుండి 2010 లోకి వచ్చేసింది అనేది చాలా సంతోషించవలసిన విషయం అనిపిస్తుంది.


[ఇంతంత సెక్యూరిటీ పెట్టారంటే తీర్పు హిందువులకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టరు 1992 లో చూశాం కదా! అని ఊహాగానాలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అబ్బే.. తీర్పు ముస్లీములకే అనుకూలంగా ఉంటుంది, లేక పోతే వాళ్ళు హిందూ దేవాలయాలన్నింటినీ పేల్చేస్తారు అని నమ్మకంగా నమ్మే వాళ్ళూ కొంతమంది కనిపించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమలాంటి సామాన్య జనాలే అని తెలుసుకోలేని వీళ్ళందరి అమాయకత్వాన్నీ, నిరాశావాదాన్నీ తుంగలో తొక్కే అవకాశాన్ని భారత సమాజం సగర్వంగా అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. తమ అంచనాలు తప్పైనందుకు వీళ్ళు కూడా చాలా సంతోషించి వుంటారు అనేదాంట్లో నాకైతే సందేహం లేదు. ]


అసలు స్థల వివాదాన్ని అధారాలని బట్టీ, న్యాయ సూత్రాలకి అనుగుణంగా కోర్టు ఇచ్చిన తీర్పు చాలావరకూ అమోదయోగ్యంగా వుండడం మంచి పరిణామమే. తీర్పు అన్ని వర్గాలకూ వీలయినంత వరకూ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే సుప్రీం కోర్టులోనో లేదా చర్చల ద్వారానో చూసుకోవచ్చు. ఏనిర్ణయమైనా శాంతియుతంగా స్వీకరించి లోటు పాట్లని ప్రజాస్వామ్య పద్దతుల్లో సవరించుకొనే పరిణతి మన దేశ పౌరులు చూపిస్తున్నారు. 


అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వేల పేజీల మొత్తం తీర్పునీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో. అయినా శ్రీరాముడి ఖచ్చితమైన జన్మస్థానంతో ఈ స్థల వివాదానికి సంబంధం ఏంటి? చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాలనుండీ విశ్వసిస్తున్నారు అనే ప్రాతిపదిక న్యాయ నిర్ణయాలకి పనికొస్తుందా? అయినా మత విశ్వాసాలకీ, నమ్మకాలకీ న్యాయ వ్యవస్థ నుండి అమోదముద్ర అవసరం లేదు కదా!


ఒకవేళ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళితే, మిగతా అన్నింటిలోనూ ఈ తీర్పుతో అంగీకరించినా, ఈ ప్రస్తావనని మాత్రం సుప్రీం కోర్టు సరిచేస్తుందని నా నమ్మకం. సుప్రీం కోర్టు వరకూ ఈ కేసు వెళ్ళక పోతే, ఇది కేవలం ఒక పొరపాటుగా మాత్రమే మిగిలి పోవాలనీ భవిష్యత్తు తీర్పులకీ, ఆలోచనా ధోరణులకీ మార్గదర్శకం కాబోదనీ ఆశిద్దాం!

29, సెప్టెంబర్ 2010, బుధవారం

సున్నీ వక్ఫ్ బోర్డ్ Vs. రామ జన్మభూమి న్యాస్


రేపు రాబోయే తీర్పు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తీర్పు తదనంతరం తలెత్తే అవకాశం ఉన్న దుష్పరిణామాల దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అభినందనీయమే. ప్రధాన పార్టీలన్నీ, తీర్పు ఏవిధంగా వున్నా గౌరవిస్తామనీ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలనీ, ఆవేశకావేశాలకు దూరంగా ఉండాలనీ ప్రజలకు పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. అన్ని పార్టీలూ ఇటువంటి వైఖరి తీసుకోవడం, మొత్తంగా మన రాజకీయ వ్యవస్థ పరిణతిని సూచిస్తుందనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. 1992 లోని మనకీ 2010 లోని మనకీ ఎంతో తేడా ఉంది అనేదానికి ఇంతకంటే ఉదాహరణలింకేం కావాలి?


మన జనాలంతా రేపేదో భయంకరమైన ఉన్మాదంలోకి వెళ్ళి పోతారేమో అనిపించే కధనాలు మీడియా కొంచెం తగ్గిస్తే బావుండేది కదూ? కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహం చూస్తుంటే, రేపేమీ జరగక పోతే బాధ పడేట్టున్నారు. ఒకటీ అరా అక్కడక్కడా జరిగే చెదురు మదురు సంఘటనలని ఎక్కువ చేసి చూపి, మొత్తం సమాజాన్ని ఉన్మాదులుగా చిత్రీకరించేంత దుస్సాహసానికి ఒడిగట్టరనే ఆశిద్దాం.


అయోధ్యలోని మందిరం లేక మసీదు మాత్రమే ఈ దేశం లోని హిందువులకూ, ముస్లీములకూ తమ సగర్వమైన అస్థిత్వాన్ని చాటి చెప్పే ఏకైక మార్గం కాదు. భారతీయులుగా మన జీవితాల్లోనూ, హిందూయిజం లోనూ, ఇస్లాంలోనూ అంతకంటే విలువైనవెన్నో వున్నాయి.

27, సెప్టెంబర్ 2010, సోమవారం

చవితి నాడు కథ చదవని జగన్...

మంచి రాజకీయ భవిష్యత్తూ, కోరుకున్న పదవి దక్కాలంటే ఏం చేయాలో అధిష్ఠాన దేవత ఉపదేశించారు. జగనూ, రోశాయ్యా ఊపిరిబిగబట్టి శ్రద్ధగా విన్నారు. ఉపదేశం సారాంశం ఏంటంటే, గ్రామ గ్రామానా ఉన్న ప్రజలందరినీ దర్శించు కుంటే పదవులు దక్కే యోగం పడుతుందట. వీళ్ళిద్దరిలో ఎవరైతే ముందుగా ఆ పని పూర్తి చేసుకొస్తారో వారికి అధిష్ఠానం అనుగ్రహం లభిస్తుందట.


యువకుడూ, ఉత్సాహవంతుడూ అయిన జగన్ పరుగు పరుగున ఆ పని  ప్రారంభించేశాడు. వయోవృద్ధుడైన రోశయ్య దిగులుగా బయటకొచ్చి, ఆప్తుడైన అహ్మద్ పటేల్ దగ్గర, ఈ పోటీలోని అన్యాయం గురించి వాపోయారు. ఇటువంటివెన్నో చూసిన అహ్మద్ పటేల్ చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోగానే రోశయ్య గారికి చటుక్కున ఙానోదయమయ్యింది. ఊరూరూ తిరగడమెందుకని అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్ కేమో ఒక్కో వూరు వెళ్తుంటే, ఆ వూరి నుండి రోశయ్య గారు అప్పుడే బయటకెళ్ళినట్టు కనిపించడం మొదలయ్యింది. 


సందేహం: హిందూత్వ భావనలని ఇంత చక్కగా వంటబట్టించుకొని అవలంబిస్తున్న కాంగ్రేసెక్కడా!! ఎప్పుడు చూసినా ఒక్క రాముడి గురించే సోది చెప్పే BJP ఎక్కడ?


Source: one of my friend shared this joke seen on one of the channels.. Liked it very much. Posted just for the fun and satirical value :) With thanks to google image search...

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

మా గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు - రెండవ భాగం


బస్సు తో తంటాలు:
అసలే ఊరికి దూరం అవడంతో, మా కాంప్లెక్స్ కి దగ్గర్లోనే కేంద్రీయ విద్యాలయా ఉండడంతో చాలా మంది పిల్లల్ని అక్కడే చెర్పించారు. ఆటోల్లో పిల్లల్ని కుక్కి కుక్కి పంపే అవస్థ చూసి మా కమిటీ వాళ్ళు కాంప్లెక్స్ పిల్లల కోసం ఒక బస్సుని 'నో ప్రాఫిట్ నో లాస్' పద్దతిలో నడపడానికి ఏర్పాట్లు చేసి, అబ్బో.. సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు.  
 
సరే ఇంకేముంది ఏర్పాట్లన్నీ చక చకా జరిగి పోయాయి. ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చి 33 సీట్లున్న మా బస్సుకి దాదాపు 45 మంది పిల్లల ఆదరణ లభించింది.  కొంత మంది పిల్లల భద్రత గురించి పాపం చాలా ఎంక్వయిరీ చేశారు. బస్సు డ్రైవర్ కీ, కండక్టర్ కీ మార్గ నిర్దేశాలూ జాగ్రత్తలూ తయారు చేసేసారు. పిల్లల లెక్క చూసుకోవడం, తలుపులు, కిటికీలూ సరిగ్గా మూయడం లాంటివన్న మాట. ఇంకొంత మందైతే కాంప్లెక్స్ దాటగానే మైన్ రోడ్డు మీద వేరే వాహనాలొస్తాయికదా, ప్రమాదాలు నివారించడం ఎలాగో చర్చించాల్సిందే అన్నారు.   
 
అన్ని ఇళ్ళలోని పిల్లలకీ వీలుగా ఉండడంకోసం ఒక రూట్ మ్యాప్ (అంటే కాంప్లెక్స్ లోపల ఎలా గిరికీలు కొట్టాలనే స్పెసిఫికేషన్ అన్న మాట) కూడా తయారు. ప్రత్యేకంగా ఈ బస్సు సంగతి చూసుకోవడానికి ఇద్దరితోనో ముగ్గురుతోనో ఒక సబ్ కమిటీ కూడా వేసేశారు. ఇంకజూస్కోండి పొద్దున్నే హడావిడి, పాపం ఆ సబ్ కమిటీ సభ్యులంతా మోటార్ సైకిళ్ళ మీద బస్సు ముందో వెనకో ఒకటే చక్కర్లు. పాపం అంతా సజావుగా జరిపించాలనే తపన వాళ్ళది! నాకెలా తెలుసు వాళ్ళ ఉద్దేశ్యం అనుకుంటున్నారు కదూ! మరదే.. తెలిస్తుందంతే, మీరు నమ్మాల్సిందే.
 
ఒక్క రోజు అనుభవం నేర్పిన పాఠాలు ఏంటంటే ఈ రూట్ మ్యాప్ మొదట్లో వుండే పిల్లల్ని ముందుగానే తయారు చేసి బస్సెక్కించాల్సి వసుంది. చివర్లో ఎక్కే పిల్లలకేమో సీట్లు దొరకవు. పైగా కొన్ని లేన్లలో బయటే పార్క్ చేసిన కార్ల వల్ల బస్సుని గిరికీలు తిప్పడం కష్టమయి పోతుందని మా డ్రైవర్ ఇబ్బంది పడడం. ఈ మధ్యలో మా సుపుత్రుడు చివర్లో ఎక్కే వాడి ఫ్రెండ్ కోసమని పక్క సీట్లో పుస్తకాల సంచీ పెట్టి బ్లాక్ చేశాడు. వెధవ్వేషాలెయ్యొద్దని చెప్పి ఎలాగో తీసేయించాం లేండి.   
 
ఈ గుణ పాఠాల పుణ్యమాని రెండో రోజుకి రూట్ మ్యాప్ ని పక్కన పడేసి మైన్ స్ట్రీట్ లో మాత్రమే బస్సు వెళ్ళేట్టూ, అన్ని లేన్స్ వాళ్ళూ, వాళ్ళ లేన్ చివర్లో ఎక్కేట్టు మార్పు చేసేశాం. రెండు మూదు రోజుల తరవాత గమనిస్తే, అందరూ బస్సు ఎక్కడ వుంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించడం మొదలెట్టారు. ఒక వారం పొయ్యాక, చాలా మంది బస్సు స్టార్టింగ్ ప్లేస్ కే వెళ్ళి ఎక్కిస్తున్నారు. కారణం ఏంటంటే పిల్లలకి సీట్లు దొరకడానికన్న మాట.
[50 మంది పిల్లలకి 30 సీట్లున్న బస్సుంటే, సహజంగానే క్యూ పద్దతులూ గట్రా హుష్ కాకి అవుతాయి. పోనీ రెండు ట్రిప్పులు తిప్పడం లేక రెండు బస్సులు వెయ్యడం లాంటి వాటికి మా అసోసియేషను ఆర్ధిక వనరులు సరిపోవు. మన సమాజంలో పరిస్థితి కూడా అదేకదా!]
పారిశుధ్యం, మన్నూ, మశానం :
కాంప్లెక్స్ లోపలి గార్డెన్ చూసుకోవడానికి ఒక కాంట్రాక్టూ, రోడ్లూ అవీ ఊడ్చడానికి ఒక కాంట్రాక్టూ ఇచ్చేసి అవుట్ సోర్సింగ్ ద్వారా కాలనీ ప్రజల జీవన్ ప్రమాణాలు మెరుగు పరిచే కార్యక్రమం కూడా బానే అమలవుతుంది లేండి.
 
ఈ మధ్యే ఒక మంచి ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతుంది మా కమిటీ వాళ్ళలో. అదేంటంటే, మన వాళ్ళు కొంత మంది కుక్కల్ని పెంచుకుంటున్నారు, వాటిని రోడ్ల మీదికి వాకింగ్ అనే హార్మ్ లెస్ పేరుతో తిప్పుతున్నారు. వచ్చిన చిక్కేంటంటే, పాపం అవికూడా ప్రాణులే కదా! రోడ్లు ఖరాబు చేస్తున్నాయి. ఎలా చెప్పాలి, కుక్కల హక్కు దారులకి మార్గాంతరం ఏం చూపించాలి అని!
 
ఒకరిద్దరు మాత్రం, ఆ.. ఏంటి, మనం పాశ్చాత్య దేశాల్లో చూడట్లేదా, వాళ్ళ లాగా వీళ్ళని కూడా చేతులకి డిస్పోసబుల్ కవర్లు తొడుక్కోమని చెప్పేయడమే, లేకపోతే ఈ అవుట్ సోర్సింగులూ ఇవన్నీ ఎందుకు దండగ అన్నారు.  ముందు కాలనీలోని సూపర్ మార్కెట్టు వాడిని అటువంటి కవర్లు అందుబాటులో వుంచమని చెప్పి, తరువాత వీళ్ళకి చెప్తే బెటర్ అనె దిశ లో సాగుతున్నాయి ఆలోచనలు. (నిజమే కదా అమెరికా వాడి దగ్గరుండే మంచి లక్షణాలు మాత్రం వదిలేసి, వాడి దగ్గరుండే అవలక్షణాలు మాత్రమే పట్టుకొచ్చేస్తున్నారు మనవాళ్ళు)
 
సారాంశం:
నేను గమనించిన విషయాలు అర్థం చేసుకునే ప్రక్రియలో రాశానే గానీ మా వాళ్ళంతా స్వతహాగా చాలా మంచి వాళ్ళండోయ్. కాకపోతే ఇంతమంది కలిసి పనులు చేయడంలో ఉండే ఇబ్బందులూ, సౌకర్యాలూ, అసౌకర్యాలూ తెలుస్తున్నాయంతే. అందరూ చదువుకున్న వాళ్ళూ, రీజనబుల్ వాళ్ళూ ఉన్న ఒక చిన్న కాంప్లెక్స్ లోనే ఇంత క్లిష్టంగా ఉంటే ఒక 100 కోట్లమంది అనేక రకాల నేపధ్యాల వాళ్ళు ఉండే దేశాన్ని నడపడమంటే మాటలా!!!

20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు - మొదటి భాగం

ఉపోద్ఘాతం:
ఎదో ఒక చిట్ ఫండ్ లో చేరకపోయినా, ఆ మధ్య ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హౌసింగ్ లోన్ల పుణ్యమా అని ఒక ఇల్లు కొనుక్కున్నాం ఈ మధ్య. కొంచెం పెద్ద వెంచరే, మంచి మంచి ఫెసిలిటీలూ (మొదటి పది రోజులు తప్ప వాడక పోయినా) మాములే అనుకోండి. ఇల్లు ఆఫీసుకి దూరమవ్వడం, ఆప్పుడప్పుడూ అసొసియేషన్ మీటింగుల వల్ల ఇంట్లో అలకలూ షరా మాములే.


మొత్తం మీద రెసిడెంట్స్ అంతా బాగా చదువుకున్న వాళ్ళూ, జీవితంలో ఎన్నో చూసిన వాళ్ళూ, ఎంతో సాధించిన వాళ్ళూ, వీలయినంత వరకూ మంచిగా వుండాలనుకునే వాళ్ళే. రోడ్ల పైన పాన్ ఊసే వాళ్ళని తిట్టుకోవడం, క్యూ పద్దతి పాటించకుండా తోసుకునే వాళ్ళని చూసి నిట్టూర్చడం, రూల్స్ ప్రకారం నడుచుకోవడానికి వీలయినంతవరకూ ప్రయత్నించడం, అప్పుడప్పుడూ సమాజ సేవ చెయ్యడం, జనాల్లో తగ్గిపోతున్న సివిక్ సెన్సు గురించి బాధ పడటం వంటి మంచి లక్షణాలు మా కాంప్లెక్స్ పౌరుల్లో పుష్కలంగా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటా.
------------------------------------------------------------
భాషతో తంటాలు:
మా సర్వ సభ్య సమావేశంలో ఒకసారి ఒకాయన తెలుగులో మాట్లాడగానే, Please talk in a language which everyone can understand అని ఒక సూచన రావడం దానికి చాలా మంది మద్దత్తు తెలపడం వెంట వెంటనే జరిగిపోయాయి. అంటే ఇంగ్లీషు గానీ హిందీగానీ అని దాదాపు తీర్మానించినంత పని చేశారు. NRI పిల్లల తల్లిదంద్రులు కొందరు ఇబ్బందిగా చూశారే గానీ పాపం మాట్లాడె చొరవ చూపలేదు.


నా లాంటి రాజకీయ వాది అక్కడ ఉండగా మాట్లాడలేని వాళ్ళకు అన్యాయం జరగదనుకోండి :-) వెంటనే మైకుచ్చుకొని, బాబులూ ఎవరికి వీలుగా వున్న బాషలో వాళ్ళు మాట్లాడండి, సారాంశాన్ని మాత్రం మరొ బాషలో కూడా ఎవరొ ఒకరు చెప్పండి అని ప్రతిపాదించడంతో ఆ గండం గడిచింది.


సరే వీధులకి పేర్లు చర్చించి మా కమిటీ వాళ్ళు, చక్కని తెలుగు పేర్లు తయారు చేసి పర్లేదనిపించారు. (అంటే, అల్లూరి సీతా రామ రాజు వీధి, లక్ష్మీ బాయి మార్గము అలా అలా..) చక్కగా తెలుగులో బోర్డులు తయారైపోయాక ఇక చూస్కో నా సామిరంగా... మొదలైపోయాయి సిద్ధాంత పరమైన చర్చలూ, అభిప్రాయాలూ. బోర్డులు ఇంగ్లీషు లో లేకపోతే కష్టమని కొంతమందీ, ఆ ఏం పర్లేదు కింద ఇంటి నంబర్లున్నాయిగా అని ఇంకొందరూ, అసలు తెలుగులోనే పెట్టడం కరెక్టు అని మరికొందరూ, ఒక రెండుమూడు బాషల్లో రాయాలని మరికొందరూ లాజిక్కులు ఇరగ దీసేసారు.


అయ్యా బాబులూ ఇప్పటికి మా మట్టి బుఱ్రలు చించుకొని ఇది చేసేశాం కాబట్టి ఈసారికిలా కానిచ్చేయండని కమిటీ మెంబర్లు మొత్తుకోవడం మొదలెట్టేశారు. అసలిలాంటివి చేసే ముందు అందరినీ అడిగి చెయ్యాలని దాడి కమిటీ వాళ్ళ వైపుకి మళ్ళింది. ఆవేశపరుడైన మా కమిటి సెగట్రీ అప్పటివరకూ నూరుకుంటున్న పళ్ళకి కొంత విరామం ఇచ్చి, అసలేంటి, ఇలా ప్రతి చిన్న విషయానికీ అందరితో చర్చలు చేయాలంటే నాతోని గాదు, నాకు చెతనైనంత వరకూ నేను చెశా.. అలా అందరినీ అడిగి అన్నీ చేసేంత తీరిక వున్నవాళ్ళు ఉండండి అని రాజినామాస్త్రం ప్రయోగించేశాడు. ఆ దెబ్బకి మావాళ్ళంతా కొంచెం వెనక్కి తగ్గారు. ఇంకో బకరాని ఒప్పించడం అంత తేలికా చెప్పండి!!


సీను కట్ చేస్తే నేనిల్లు చేరి, మా అబ్బాయి మేడ మీదికి రాకుండా, ఎప్పట్లాగే అర్ధాంగిని ఫీల్డింగ్ చెసుకోమని బతిమాలుకొని మెడమీదికెళ్ళి సిగిరెట్టు తాగుతూ ఆలోచించడం మొదలెట్టా.. ఏం ఆలోచించానో తరువాతిటపాల్లో చెప్తాగానీ ఈ లోపు మీరు ఊహించడానికి ప్రయత్నించండి.


(ఇంకా బోలెడు కబుర్లున్నాయి.. తరువాతి టపాలో..)

9, సెప్టెంబర్ 2010, గురువారం

గతిలేక కొంతమంది, గత్యంతరం లేక కొంతమందీ, దురాశతో కొంతమందీ...

మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా దేశంలోని అవినీతి మీద వెల్లడించిన అభిప్రాయాలు కొత్తవేం కాకపోయినా, చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువివ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన విషయాలూ అభిప్రాయాలు కొంతైనా మంచి పరిణామాలకు దారి తీస్తాయనే ఆశిద్దాం. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఒకసారి చూద్దాం.


1. దేశంలో మూడోవంతు మంది పూర్తి అవినీతిపరులుగా మారిపోగా దాదాపు సగం మంది అవినీతి మకిలి అంటించుకున్న వాళ్ళేనట! ఇరవై శాతం మంది ప్రలోభాలకీ పరిస్థితులకీ లొంగకుండా నిజాయితీ పరులుగానే ఉన్నారనేది శుభ పరిణామమే.


2. కొన్నేళ్ళక్రితం అవినీతికి పాల్పడిన వారికి సమాజంలో గౌరవం ఉండేది కాదు. ఒక రకమైన సామాజిక నిరసనా, సాఘీక నిరాదరణా ఎదురయ్యేవి. అయితే ఈ మధ్య కాలంలో అది కూడాలేకుండా పోయిందనీ, అవినీతి కి సాంఘీక ఆమోదం లభించడం అనేది ఒకింత చేదు నిజం.


3. మారుతున్న సామాజిక విలువలని కూడా CVC ప్రస్తావించారు. ఒకప్పుడు మనిషి సత్ప్రవర్తనని బట్టో, లేక సమర్ధతని బట్టో సమాజంలో గౌరవం లభించేది. అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఎంత ధనవంతుడు అనేది మాత్రమే గౌరవానికి కొలబద్దగా మారటం కూడా ఒక పెనుప్రమాదమని CVC అభిప్రాయ పడ్డారు.


ఇంతమంది ప్రజలు అవినీతికి అమోదముద్ర వెశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. పైన సిన్హా గారు చెప్పిన అభిప్రాయల ద్వారా గానీ ఇతరత్రా మన అవగాహన వల్ల కానీ గత్యంతరంలేని పరిస్థితుల్లో అవినీతి పరులుగా మారేవాళ్ళూ, గతిలేక అవినీతి పరులుగా మారేవాళ్ళూ చాలా మంది ఉన్నారనేది మనకందరికీ తెలిసిందే. వీరితో పాటు దురాశతో అవినీతి చేసే వాళ్ళూ బానే వున్నారు.


పై స్థాయిల్లో జరిగే రాజకీయ అవినీతి అతి ప్రమాదకరమైనదీ, పైగా అవినీతిని కింది స్థాయి వరకూ పెంచి పోషించేదీనూ. ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే అవినీతి చేస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఉంది. పై స్థాయిలన్నీ అవినీతి మయమైనప్పుడు ఇలాగే జరుగుతుంది మరి అని సరిపెట్టుకోలేమనిపిస్తుంది. చాలా వరకూ అది నిజమే అయినా, ముఖ్యంగా అవినీతికి సమాజంలో అమోదం లభించడం గానీ, లేక కేవలం డబ్బు ద్వారానే ఒక మనిషికిచ్చే విలువ నిర్థారించబడడం కానీ ఇవి మనలో గూడు కట్టుకుంటున్న సామాజిక రుగ్మతనే సూచిస్తున్నాయి. దీన్ని నిర్మూలించడం అంత సులభమేం కాదు.


వారంలో 6 రోజులు పనిచెయ్యడానికి సిద్దమైన వాళ్ళందరూ కనీస జీవన ప్రమాణాలని అందుకునే పరిస్థితి నెలకొల్పితే గతిలేక చేసే అవినీతిని చాలావరకు అరికట్టవచ్చు. మిగిలిన అవినీతిని అరికట్టడానికి ఒక మార్గం దొరుకుతుంది.


అన్నిటికంటే ముందు రాజకీయ అవినీతిని అంతం చెయ్యాలి అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎలా? ధనవంతుడు కానివాడు రాజకీయాల్లో నెగ్గుకురాగలడనే విశ్వాసం లేదు కదా మనలో! ఏ పార్టీలు నింపుతాయి ఆ విశ్వాసాన్ని? ఏ నాయకులు కల్పిస్తారు ఆ మాత్రం నమ్మకాన్ని?


మనవంతుగా, మరీ సంఘసంస్కర్తలుగా అవతారమెత్తక్కరలేకుండా, వీలయినంతవరకూ ఎదుటి మనిషికి వారివారి ప్రవర్తనని బట్టి మాత్రమే గౌరవం ఇవ్వడం, మనకెదురయ్యే అవినీతి పరులకి గౌరవాన్ని ఇవ్వకపోవడం లాంటివి చెయ్యొచ్చేమో. ఈ సారి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినప్పుడు, ఎంతిస్తే వదిలేస్తాడు అని కాకుండా, మన వయొలేషన్ కి ఫైన్ ఎంత అని కూడా ఆలోచించొచ్చు. ఇంత డబ్బులిచ్చి ఈ పని చేయించాను, ఫలానా వాడు ఎంతబాగా (పైడబ్బులొచ్చే పోస్టు మరి) సంపాదించాడో అని పిల్లల ముందు మాట్లాడడం ఆపెయ్యొచ్చు. కొద్దిగా ఇబ్బందైనా వీలయినంతవరకూ లంచాలు ఇవ్వకుండా మన పనులు చేసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.

31, ఆగస్టు 2010, మంగళవారం

దిగజారుడుతనానికి ప్రతీకలుగా పేరడీ బ్లాగులు ?

కొంతమంది రాసే విషయాల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది పేరడీ బ్లాగులు నడుపుతున్న విషయం జగద్విదితమే. వాళ్ళ మధ్య ఏమేం సమస్యలున్నాయో, ఎవరు ఎవరిని ఎందుకు కెలుక్కుంటున్నారో, ఎందుకు గిల్లుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు తేల్చుకోవలసిన విషయం. అందులో మన అభిప్రాయాలు మనకుండొచ్చు కానీ అవి ఇక్కడ అప్రస్తుతం.


ఇక్కడ విషయమేంటంటే, ఈ పేరడీ బ్లాగులు గొప్ప గొప్ప దేశ నాయకులనీ, దేశ రాజ్యాంగాన్నీ కూడా తమ రొచ్చులో నిర్లజ్జగా వాడుకోవడం బహుశా క్షణికావేశంలో జరిగి ఉండవచ్చని ఆశిస్తున్నాను.  అలా కాని పక్షంలో మనోభావాల ముసుగేసుకు తిరుగుతున్న వీళ్ళకు, మామూలు భారతీయుల మనో భావాలు దెబ్బతింటాయి ఇలాంటి చర్యలవల్ల అనితెలియదనుకోవాలా?   


దేశ నాయకులూ, రాజ్యాంగమూ విమర్శలకు అతీతం కాదు. కానీ ఆ విమర్శలు విషయం మీద జరిగితే ఆహ్వానించవలసిందే. కానీ ఇదేంటి, వీళ్ళు చేసుకునే పనికిమాలిన పనుల కోసం, చెత్త పేరడీ కోసం దేశ నాయకులనీ రాజ్యాంగాన్నీ వాడుకోవడం ఎంతవరకూ సబబు?


మెజారిటీ బ్లాగరులు నా భావాలతో ఏకీభవిస్తారనే నమ్మకంతో..


మీ,
వీకెండ్ పొలిటీషియన్/- 

30, ఆగస్టు 2010, సోమవారం

ఒకే ఒరలో అసమర్థతా, నియంతృత్వం - మీడియా గొర్రెలమంద స్వభావం

గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరిగిన కొన్ని విషయాలను చూస్తే ప్రజాస్వామ్య వాదులెవరికైనా ఆందోళన కలగడం సహజం. మీడియా తో పాటు సెకండ్ గ్రేడ్ రాజకీయ నాయకులూ కలిసి అసలు విషయాన్ని పక్కనబెట్టి ఈ విషయాలకు ప్రాంతీయ ఉద్యమాల రంగూ, కాంగ్రేస్ పార్టీ అంతర్గత కుమ్ములాట ముసుగూ తొడిగే ప్రయత్నం లో సఫలీకృతులవ్వడం మరింత బాధ కలిగించే విషయం. ఇంతకీ నన్నింతగా కలవర పెట్టిన అంశాలు ఏంటంటే,


1. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన దాడి సంఘటన - ఒక ఉద్యమం నేపధ్యంలో ఒక ప్రాంతం వారిని నమ్మలేక పోవడమనే కారణంతో ఉస్మానియా పరిధిలోనే తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసే అధ్యాపకులను తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించకుండా అడ్డుకొని తరిమి తరిమి కొట్టడం జరిగింది. ఇక్కడ ఉద్యమ నేపధ్యంలో వాదన జరుగుతుంది. అది వేరే విషయం. అయితే, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చట్టబద్దంగా చెయ్యాల్సిన పనిని చెయ్యలేని పరిస్థితి దాపురించింది. అంత సమస్య ఉంటే, ముందుగానే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలంగాణా వాదులకు వివరించి ఉండాల్సింది. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళని ఆ విధుల నుంచి తప్పించాల్సింది. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయం సరైనదే అని భావించి ఉంటే, తన పని తను నిర్వహించగలిగి ఉండాలి.
 
ఇప్పుడు జరిగిందేంటి? ఒక ప్రజాప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వర్తించలేని దుస్థితి దాపురించింది. దీన్నేమంటారు? చేతగానితనం, అసమర్థతా అనరా? ఇది ఫెయిల్యూర్ ఆఫ్ కాన్ స్టిట్యూషనల్  మెషినరీ కాదా? ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు?
2. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన అకృత్యం - ఇక్కడ క్కొంతమంది ప్రజలు YSR విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అభిలషించారు. అది ఎంతవరకు అవసరం అనేది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలోని మామూలు ప్రజలు నిజంగానే కోరుకున్న న్యాయబద్దమైన కోరిక. సహేతుకమైన కారణం చూపించకుండా, ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిరసించిన ప్రజలను భయపెట్టడానికి పెద్దమొత్తంలో పోలీసులను మొహరించి, చివరికి అతి దారుణంగా స్త్రీలనూ, వృద్ధులనూ కూడా చావబాది అరెస్టులు చేశారు. ఇదేదో జగన్ వర్గాన్ని కట్టడి చేసే చర్యగా చూడాల్సి రావడం దురదృష్టకరం.
అతి ముఖ్యమైన విషయమేంటంటే, ప్రభుత్వాలు చట్టాలను తమ ఇష్టం వచ్చినట్టు రాజకీయ ప్రయోజనాలకోసం అతిక్రమించి, అదేమని అడిగే ప్రజలను అణిచివేయడం. అంటే, ఒక రకమైన నియంతృత్వం కాదా?
-----------------------------------
 
ఎంతసేపూ జగన్ ని వెనకేసుకు రావడానికో, వ్యతిరేకించడానికో లేక తెలంగాణా వాదానికి వ్యతిరేకంగానో, అనుకూలంగానో మాత్రమే ఈ అంశాలను వాడుకోవడమేనా?
 
ప్రజాస్వామ్య విలువలకీ, రాజ్యాంగస్ఫూర్తికీ తూట్లు పొడిచిన ఇంత ముఖ్యమైన దృక్కోణాలని మీడియా ప్రజలముందుకు తేకుండా, రాజకీయ నాయకులు ప్రశ్నించకుండా, ఏవో మసాలా కబుర్లను అమ్ముతుంటే మన ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి?


కొసమెరుపు:
పైగా మన మీడియా, గురువులకివ్వాల్సిన గౌరవం గురించీ యెదవ సొల్లు కవితలతో పాటు ఇచ్చిన కవరేజీ చాలా హాస్యాస్పదంగా ఉంది. అప్పటికి ఇలాంటి పనులు మిగతా వాళ్ళమీద జరితే పర్వాలేదు అన్నట్లు.


అసలన్నింటికంటే తమాషా ఏంటంటే, OU ఘటన మీద ముఖ్యమంత్రి స్పందన: చాలా ఆవేదన చెందుతున్నాను అని. ఎవడిక్కావాలి బోడి ఆవేదన? CM నుండి మనం ఏం వినాలి? ఈ సమస్య మీద ఒక వైఖరి లేదా తీసుకోబోయే చర్యలు. ఈ ఆవేదన ఏంటి? జరిగే అరాచకాలకి, మాములు ప్రజలూ ఆవేదనే, తన్నులుతిన్న వాళ్ళూ ఆవేదనే, CM కూడా ఆవేదనే :(   

28, ఆగస్టు 2010, శనివారం

అభ్యుదయం, సనాతనం - బొంగు, భోషాణం...చివరికి శరత్ కాలం


నేపధ్యం
అభ్యుదయ వాదం, సనాతన వాదం (ఇంకా చాలా వాదాలు వున్నాయి లేండి, వాటి గురించి ఇంకోసారి చూద్దాం)- అసలీ అభ్యుదయవాదులంటే ఎవరు? సనాతన వాదులంటే ఎవరు? ఒకడేమో సనాతనం గొప్పదంటాదు, ఒకడేమో మరీ అంత సనాతనం కూడదంటాడు! ఒకడేమో నేనే పెద్ద అభ్యుదయవాదినంటాడు! ఒకడేమో అసలు వున్న అభ్యుదయ వాదం సరిపోవట్లేదంటాడు!
అబ్బో!! ఇందులో క్లారిటీ లోపించింది అని చాలా కాలం నుంచీ ఆలోచిస్తున్నా. అంతర్జాలం లో ఎంటర్ అవ్వగానే, అసలు ఈ పదజాలం, భావజాలం వెనక భారతీయత మీద కుట్రేమైనా వుందేమో అనే అనుమానం వచ్చింది. కానీ తెలిసింది లేండి, అలాంటిదేమీ లేదని. అసలు ఈ పదజాలాలు, భావజాలాల దెబ్బకి నకిలీ కణికుడే లాక్కోలేక పీక్కోలేక గింజుకుంటున్నాడు.

సొంత పైత్యమే మంచిదని మా నాయనమ్మ చెప్పింది గుర్తొచ్చి, ఎప్పట్లాగే మనమే నడుం బిగించేసాం. అదుగో సరిగ్గా ఆ సమయంలోనే శరత్ కాలం గారు ఒక టపా పెట్టి అభ్యుదయం సరిపోవట్లేదు, అందుకే స్వలింగ సంపర్కుల హక్కుల కోసం బ్లాగరులేమీ చెయ్యట్లేదు అని గోడు వెళ్ళబోసుకోవటం మొదలు పెట్టారు. మామూలుగానే నలుగురు జనాలు పోగయ్యి చర్చ మొదలు పెట్టారు. మందిని చూస్తే మనలోని రాజకీయ ఆంబోతు జూలు విదిలిస్తుంది కదా! విదిలించి పారేసింది. ఒక కామెంట్ పెట్టేసి, అసలీ విషయం మీద ఒక టపా రాసేస్తానని కమిటయ్యా.

విశ్లేషణ
చాలా ప్రయత్నించాను గానీ ఈ భాగం లో స్పష్టత లేదు. ఒక కామెంట్లో Sheshu Kumar Inguva చెప్పినట్లు ఇదే అంశం మీద ఇంకో బ్లాగులో చాలా చక్కటి పోస్ట్ ఉంది. అందుకే స్పష్టత లేని భాగాన్ని తొలగిస్తూ పైన చెప్పిన టపా కి లంకె ఇస్తున్నాను.

శరత్ కాలం గోడు
ఇక మన శరత్ గారి గోడు విషయానికి వస్తే, ఎదో నా నిరాశ నిశ్పృహ వ్యక్తం చెస్తున్నానంటునే బ్లాగరులందరి అభ్యుదయాన్నీ ప్రశ్నించాడు. పోనీలే ఈ భావజాలం గోల మనకెందుకు అని తప్పుకు పోనీయకుండా మీరంతా అసలు స్వలింగ సంపర్కుల హక్కుల పోరాటానికి మద్దత్తు ఎందికివ్వట్లేదని కెలికేశారు. ఇంక మామూలే, ఏందిబే నీ గోల అని కరిచేవాళ్ళు కరిచేశారు. అలో, అలో అసలు నీ అభ్యదయం ఎంత అని అరిచే వాళ్ళు అరిచేశారు. అసలేంది ఇతగాడి బాధ, ఏదో బానే రాస్తున్నాడనుకుంటుంటే ఇలా హింసపెడుతున్నాడేంటి అని పిసుక్కునేవాళ్ళు పిసుక్కున్నారు.
ఇతగాడి సమస్యేంటంటే, ఎందుకు సమాజం ఇంకా స్వలింగులను అంగీకరించలేకపోతుంది అనేది. ఇప్పుడు బ్లాగరులంతా ఆయన కోరుకునే స్వలింగ హక్కులకి మద్దత్తు పలకాలనే ఎక్స్ పెక్టేషన్ ఇతని నిస్పృహకు కారణం. అయితే సమస్యేంటంటే స్వలింగులైనా, ఏలింగులైనా వారిని కూడా మిగతా మనుషుల లాగే చూడాలి అనేంతవరకూ మెజారిటీ ప్రజలు సిద్దంగానే ఉన్నారు. అయితే స్వలింగ సంపర్కం కూడా సహజమైనదే అని ఒప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఒకవేళ అది సహజమైనదీ న్యాయమైనదీ అయితే కొన్నాళ్ళకు ఒప్పుకోవచ్చు. మీరు కావాలంటే ఆ ఒప్పించే పని మీద వుండొచ్చు.

సెక్సూల్ ప్రిఫరెన్స్ సంగతి పక్కనబెట్టి స్వలింగులని కూడా మిగతా మనుషుల్లాగే చూడాలి అనేవరకూ బ్లాగరులు కూడా సిద్దమే కదా (అసలు ప్రక్రియ మీద వాళ్ళ అభిప్రాయం ఏదైనప్పటికీ). మరి ఎందుకీ నిస్పృహ, నిష్టూరం? శరత్ గారు బహుసా వారు సాధించిన దానిని సరిగ్గా అర్థం చేసుకొని ఉండక పోవచ్చు.

Sarat, most of the bloggers accepted you as any other straight person. Most of them judge your writings and talents on their worth and are not prejudiced against you based on your sexual preference. I for one admire your courage and commitment to some thing you beleive in (be it right or wrong). I think there are many in the blogworld like me. You know it better than me.
Because of you many bloggers might have realized that oh.. gays are also as good  or as bad as anybody else. It seems you are socializing with other bloggers and every one is ok with you being a gay. You have proved at least that part. Be content with that acheivement and work on other things you are commiitted to.

Your expectation on bloggers to bat for all the rights you think Gays deserve is not reasonable. I do not know about the future. Your frustration is taking a toll on your writing skill.. take care of that.. my friend..

26, ఆగస్టు 2010, గురువారం

MPలకి జీతాలివ్వాలా? ఇస్తే ఎంతివ్వాలి?


మన MP ల జీతాలు 16000 నుండి 50000 కి పెంచారు. దాని మీద కొంత వ్యతిరేకతా కూడా వినిపించింది. చాలా మంది ఎందుకు వీళ్ళకి జీతాలు పెంచాలి? ఎలాగూ ఆడ్డదిడ్డంగా తినేస్తున్నారుగా? ఇప్పుడేమైనా ఆపేస్తారా? అని అనుమాన పడుతున్నారు. అసలు పార్లమెంటుకే వెళ్ళరు, వెళ్ళినా పార్లమెంటులో అరుచుకోవడం తప్ప వీళ్ళు చేసేదేముంది అని అనేవాళ్ళు కూడా కొందరున్నారు. అసలు ప్రజాసమస్యలిన్నుంటే వాటిని గాలికి వదిలి తమ సొంత జీతాలకోసం పాకులాడటమేంటనే ధర్మసందేహం కూడా చాలా మందికి కలిగుండొచ్చు..నాకేమనిపిస్తుందంటే,


  1. ఆసలు MP ల జీతాలు ఇంకా పెంచాలి. ఆదే మోస్తరు ప్రభుత్వోద్యొగులకి ఎంత వుందో కనీసం అంత జీతాలు ఇస్తే నష్టమేంటి? వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే కాదా అనేది చాలా అసందర్భం.
  2. సేవ చెయ్యడానికి వచ్చినోళ్ళకు జీతాలెందుకు అనేది బేసిక్ ప్రశ్న. అయితే.. ఎవరినైనా ఉచితంగా సేవ చెయ్యమని ఒక సమాజంగా మనమెందుకడగాలి? వాళ్ళు చేసే పనికి న్యాయమైన వేతనం ఇస్తే తప్పేం లేదు కదా!
  3. జీతభత్యాల వ్యవహారాన్ని నిర్ణయించే పద్దతి మాత్రం కొంత ఎబ్బెట్టుగా ఉంది(ఇప్పుదున్నపరిస్థితుల్లో వేలైనంత బాగానే స్టడీలూ, కన్సల్టేషన్లూ చేశారనుకోండి). ఎంతయినా పాపం వాళ్ళ జీతాలు వాళ్ళే నిర్ణయించుకోవడం కొంచెం ఇబ్బందే (వాళ్ళకీ మనకీ కూడా). ఇండిపెండెంట్ అథారిటీ ఎవరైనా నిర్ణయించే ఏర్పాటు వుంటే బావుంటుంది. (For example, Supreme Court Chief Justice )

ఎలా చేస్తే బావుంటుందంటారు? మీరేమంటారు? ఏంది అబ్బాయా, అన్నీ నువ్వే చెప్పేసి మమ్మల్నడుగుతావు అనకండేం! ఎందుకంటే మీ అందరిదగ్గరా చాలా పెద్ద ఆలోచనల ఖజానా ఉందని నాకు తెల్సు. ఒక్కసారి అప్ప్రైసల్ టైం లో మీరు ఎలా ఆలోచిస్తారో యాద్కి తెచ్చుకోండి.. ఆలోచనలు పరిగెత్తుకుంటూ రావూ!

25, ఆగస్టు 2010, బుధవారం

పెన్సిళ్ళ చాటున దాచేస్తే దాగని భావదారిద్ర్యం...

ఎవరైనా ఒక విషయం మీద వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు ఇతరులు దానితో విభేదించడమో, అంగీకరించడమో లేక వేరే కోణంలోంచి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమో లేక విని ఊరుకుండడమో చేస్తారు అని అనుకునే వాణ్ణి. అయితే ఈ మధ్య కొత్త కొత్త పోకడలు కొన్ని వచ్చినట్లున్నాయి.. అంటే తమ అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఇంకేదో విషయంలో వాళ్ళ స్పందన చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఒక కుహనా మేధావులు అని ఒక ముద్ర తగిలించేసి హాయిగా తప్పుకొని విషయాన్ని పక్కదారి పట్టించడం. ఈ పోకడ ఇంటర్నెట్లోనూ బాగానే ప్రబలుతున్నట్లుంది.


ఉదాహరణకు, స్త్రీవాదానికి మద్దత్తుగా మాట్లడామో అంతే.. మహిళల వైపునుంచి జరిగే పొరపాట్లన్నిటికీ నువ్వే బాధ్యత తీసుకోవాలి లేదంటే నువ్వొక కుహనా స్త్రీవాదివి అంటారు. మీరు ఏదైనా మతపరమైన విషయం మీద మాట్లాడారో, ఇంక అంతే.. వచ్చేస్తారు మన వాళ్ళు.. ఫలానా  మతంలొ జరిగిన విషయాన్ని నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు చెప్పేదాంట్లొ అర్థం లేదు అంటారు. ఒక విషయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు అన్నింటిమీదా గుత్తాధిపత్యం తీసుకోవాలి అన్నట్లు. అదేదో వీళ్ళే ఖండించొచ్చు కదా!!


ఏవో కొన్ని ప్రశ్నించరాని సూత్రాలూ, నమ్మకాలూ మనసులో పెట్టేసుకోని వాటిని ఎవరైనా ప్రశ్నించడమో లేక కొత్త దృక్పధాన్ని తేవడమో చేస్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వారి మీద విపరీతమైన ద్రోహులుగా ముద్ర వెయ్యడం లాంటివి చేస్తారు. ఇంక చూస్కో నా సామిరంగా విమర్సల జడివాన, వ్యక్తిగత దాడి..నషాలానికి అంటుద్ది వేడి.


అవతలి వ్యకి యొక్క వ్యక్తిత్వం మీద  దాడి చేసి వాళ్ళు చెప్పే విషయాన్ని మరుగు పరచెందుకు ప్రయత్నించడం కూడా ఈ కోవలోకే వచ్చే ఇంకో పద్దతి. ఉదాహరణకు.. కె సి ఆర్ మొదట్లో తెలంగాణా వాదన వినిపించినప్పుడు, ఆ వాదం గురించి చర్చ చెయ్యకుండా, ఆయన మంత్రి పదవి కోసం చేస్తున్నాడనీ, బాగా తాగుతాడనీ (అంతకుముందు తెలియనట్లు!!) చిత్ర విచిత్ర మైన ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితులొచ్చాక మాత్రమే అసలు విషయం (తెలంగాణా వాదం) గురించి చర్చ మొదలయ్యింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది.


పోనీ అతి జాగ్రత్తగా విషయాన్ని వివరించామో, అయ్యుండొచ్చు కానీ.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారు. లేదంటే, సగటుమనిషి అనే మిథికల్ క్రీచర్ వెనకాల దాక్కుంటారు. ఎలాగంటే.. అప్పటి దాక చూపటానికి ప్రయత్నించిన మేధావితనాన్ని పక్కన పెట్టి, సగటు మనిషి కి ఇలా చెప్పకూడదు అది సమాజానికి మంచిది కాదు అనటం, లేదంటే.. నేను ఒక మామూలు డీసెంట్ సగటు మనిషిని నేనింతే అంటారు.


ఇలాంటి వాళ్ళకు ఆలోచించే ఓపికా, అర్థం చేసుకొనే సహనం లేకపోవడం వల్ల ఒకరకమైన నూతిలో కప్ప మనస్తత్వం అలవాటై పోయుంటుంది. తమకు తెలిసిన దాన్ని ప్రశ్నించినా లేక వేరే ద్రుక్కోణం చూపించినా అది తమపై జరిగిన వ్యక్తిగత దాడిగా భావించి ఒకరకమైన ఆత్మన్యూనతలో మునిగిపోతుంటారు. వెంటనే తమకు చిన్నప్పటినుంచీ ఎలా అన్ని వర్గాల ప్రజలతో స్నెహం ఉండేదో, తాము చిన్నప్పుడు ఎంత మందికి పెన్సిళ్ళు గట్రా ఇచ్చేసి ఉధ్దరించేశారో ఏకరువుపెట్టి, తమ భావదారిద్ర్యాన్ని వ్యక్తిగత మంచితనం వెనక దాచేస్తుంటారు.


ఇలాంటి అనుభవాలు మీకూ ఎదురయ్యే వుంటాయికదూ! ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు అని ఉండరేమోగానీ, ఈ రకమైన బలహీనతకి చాలామంది కొన్ని కొన్ని సందర్భాలలో లోనవుతుంటారేమో అనిపిస్తుంది. ఈ బలహీనత నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి.. ఆరోగ్యకరమైన చర్చా, అర్థవంతమైన ప్రశ్నలూ లేకపోతే ఆ సమాజం తిరోగమనంలో పడిపోయినట్టే..

24, ఆగస్టు 2010, మంగళవారం

సోనీ TV శ్రీరాం జగన్ దగ్గర ట్యూషన్ చేరడం ఒక చారిత్రక అవసరం


శ్రీరాం అదేదో పాటల పోటీలో గెలిచాడు. మంచి సింగర్. మన తెలుగువాడే అవటం మరింత ఆనందంగా వుంది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మన తెలుగు బ్లాగర్లు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. బ్లాగు బాబ్జీ SMS మోసాన్ని ఎత్తి చూపడం, మరో బ్లాగరెవరో, శ్రీరాం తమిళంలో మాట్లాడాడనే విషయాన్ని కూడా లేవనెత్తారు. మొత్తమ్మీద అనేక దృక్కోణాలు వెలుగులోకి వచ్చాయి. నాకు మాత్రం ఇంకా అర్థం కాని విషయాలు చాలా వున్నయి.


అసలు తెలువాడిని గెలిపించమని అంత వెఱ్ఱెత్తి పోవడం అవసరమా? బాగా పాడుతున్నాడు అని ప్రచారం చేసుంటే బావుండేది.


ఇక మనవాడు హైదరాబాదు వస్తే అద్భుతమైన స్వాగతం ఇచ్చారు. ఒక విజయ యాత్ర తరహాలో. అది సరిపోనట్టు మన ముఖ్యమంత్రి దారినపోయే దానయ్యగారు, విలువైన సమయాన్ని బాగానే కేటాయించి అదేదొ అవార్డు కూడా కట్టబెట్టారు. సోనీ TV లో గెలిస్తే అర్జంటుగా అవార్డ్ ఇవ్వాల్సిన అవసరం వుందా? అసలు పాటల పోటీ లో గెలిచినందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? పోటీలో గెలిచి ఆల్రెడీ డబ్బు సంపాదించు కున్నాడు. మన తెలుగు వాడూ,  పైగా మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కదా!
ఆయినా ఇతగాడు ఆ విజయ యాత్ర చేయడం మాత్రం మరీ టూమచ్. అదీ ఈ పరిస్థితుల్లో .. అసలేమనుకుంటున్నారు? ఏదైనా యాత్ర చెయ్యాలంటే ఇలాగేనా చేసేది? ముందు అహ్మద్ పటేల్ సోనీTV వాళ్ళతో చర్చించాలి, తరువాత శ్రీరాం తల్లిదండ్రులు వీరప్ప మొయిలీ ని కలవాలి, ఆ తరువాత వీహెచ్, కేకే,కాకా, శంకర్రావు మొదలైన వాళ్ళ జట్టు తో అంబటి రాంబాబు, సురేఖ జట్టు కబడ్డీ మాచ్ ఆడాలి, ఆ తరువాత రోశయ్య జనాలని వెళ్ళవద్దని చెప్పాలి, ఆ తరువాత వీలైతే గెలిచిన కప్పుని ఒక చోట పెట్టి అందరూ ఒకేసారి చూసే అవకాశం వుందేమో పరిశీలించాలి. ఇవన్నీ లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు యాత్రలు చేస్తే ఈ దేశం ఏమైపోవాలి? కనీసం, శ్రీరాం జగన్ దగ్గర ట్యూషన్ చేరుండాల్సింది. 


రాజకీయ యాత్రలకి జనాలు వస్తున్నారా, తరలిస్తున్నారా అని బోలెడంత ఆశ్చర్యం వ్యక్తం చేసే వాళ్ళకి మాత్రం కళ్ళు తెరుచుకొనే విషయం బోధపడి వుండొచ్చు. పాటలపోటీ విజయ యాత్రకే వెఱ్ఱెత్తి పొయే జనాలని చూశాక!!

16, ఆగస్టు 2010, సోమవారం

బూజు పట్టిన వరకట్న చట్టం-మరోసారి బస్సు మిస్సయిన చట్ట సభలు


లేటెస్టు గా మరొక్కసారి తామేం చేయాలో సుప్రీం కోర్టుతో చెప్పించుకోవాల్సి వచ్చింది మన రాజకీయాలకి.  వరకట్న నిషేద చట్టాన్ని సవరించమని లా కమీషన్ నీ, న్యాయ శాఖ నీ సుప్రీం కోర్టు ఆదేశించింది. IPC సెక్షన్ 498-A  (for dealing with cruelty of husband and relatives over dowry) చాలా ఉపయోగ పడింది, అయితే చాలా దురుపయోగం కూడా జరిగింది అని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. 
గృహ హింస నిరోధక చట్టం ఉన్న నేపధ్యం లో ఈ చట్టాన్ని సవరించడం వల్ల, దురుపయోగాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. అయితే చేయవలసిన సవరణల రూపురేఖల గురించి అన్ని వర్గాలతో చర్చ చాలా అవసరం.
రాజకీయ నాయకులు ఇప్పటికే దీని మీద చర్చ లేవనెత్తక పోవడం చాలా దురదృష్టకరం. 
మన రాజకీయాలు, ప్రజలని ఆలోచింప చేసి, మార్గనిర్దేశం చేసే పాత్రని చెయ్యవలనంత చెయ్యట్లేదు. కేవలం, ప్రజలు బజార్నబడి బస్సులు ధ్వంసం చెయ్యడమో లేక ఇదిగో ఇలా సుప్రీం కోర్టు మొత్తితేనో హడావిడిగా సంస్కరణలు చేయ వలసి వస్తుంది. 
తీరా   పీకలమీదికి వచ్చాక ప్రజాస్వామ్య పద్దతిలో చర్చ చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే వెసులుబాటు ఉండదు. మళ్ళీ తప్పులు చేసే అవకాశాలు, కొన్ని వర్గాల ఆమోదం లేక పోవడం వంటి ప్రమాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య సమతుల్యత దెబ్బతినాల్సి రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

13, ఆగస్టు 2010, శుక్రవారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇవ్వకపోతే మా రాజకీయ ప్రవృత్తికి తీరని ద్రోహం చేసినట్టే. పైగా మీరంతా నన్ను వీకెండ్ పొలిటీషియన్ కాకుండా వీకెన్ డ్ పొలిటీషియన్ గా అనుకునే ప్రమాదం ఉంది. ఏమాటకామాటే చెప్పుకొవాలి, సందేశాలు ఇవ్వటం, పెద్ద పెద్ద చర్చలు మొదలుపెట్టడం మనకి సహజంగానే ఉన్న ఈక్ నెస్సేలెండి:)
అసలు విషయానికి వస్తే, స్వాతంత్ర్యం ఇంకా రాలేదనీ, వచ్చింది నిజమైన స్వాతత్ర్యం కాదనీ, లేక అంతా బ్రహ్మాండంగా ఉందనీ, మనమొక్కళ్ళమే ప్రపంచంలోకెల్లా అతి గొప్ప వాళ్ళమనీ బోలెడు ఉపన్యాసాలు వస్తాయి. వాటి కైపు లో పడి అవేశమో, ఆనందమో తెచ్చుకొని ఒక రోజంతా గుండెలనిండా స్వేచ్చా వాయువులు పీల్చుకొని మళ్ళీ ఎప్పట్లాగే బండి లాగించెయ్యడం, చిన్న చిన్న జెండా బొమ్మలూ గట్రా కొని కార్లలో పెట్టేసి దేశభక్తి చాటి చెప్పెయ్యడం, అప్పడప్పుడూ సమాజ సేవ కార్యక్రమాలు కూడా చెయ్యడం, బ్లాగులు రాసుకోవడం ఇంతేనా ఇంకేమీ చెయ్యలేమా అనిపించింది.


ఆలోచిస్తే అర్థమయ్యింది, ఇదేంటి ఎమైనా చేసేదుంటే చెయ్యాలి... దానికి ప్రత్యేకంగా స్వాతంత్ర్య దినోత్సవం తో సంబంధం లేదనీ, ఈ సింబాలిక్ అకేషన్, అనుభవాలని నెమరు వేసుకొని, పరిస్థితిని అంచనా వేసుకోని, స్వాతంత్ర్యాన్ని పెంపొందించే ఆలోచనలకు శ్రీకారం చుట్టే ఒక మంచి అవకాశం అనీ. So.. let me share some of my thoughts with you all..  
 
The moment of Independence for this country was a moment of truimph, sombreness and a moment of resolve. We, the people of this country have delivered a great message to the world, learned a few lessons ourselves and started our journey into the unknown future with a resolve to continue on the path of truth and justice.

We have acheived a lot durring all these years and still have a long way to go. Our freedom has ensured a bettter life for many. Still there are many who are waiting to taste the fruits of Freedom. for those, we have succeeded in establishing Hope. To realize this hope into concrete reality, as a nation we need to work on a new kind of freedom now. That is the freedom to come out of our own self doubt, freedom from lack of trust in our fellow countrymen.


Yes we need to inculcate a spirit of trust in each other and work on freeing our minds from narrow, cynical and parochial way of looking at things. If we take a vow now to work on this new freedom our children, their children and every future child will remember us on this day in future. Yes, if we can achieve this new freedom we will continue to be a great nation and will pass on a much greater legacy to the future generations.


అయ్ బాబోయ్, వీకెండ్ పొలిటీషియన్ లో, వీకెండ్ తగ్గి పోయి పొలిటీషియన్ పెరిగిపోయాడేంటి !! 


కాబట్టి మితృలారా, బ్లాగరులారా, గేలారా, బై లారా, రౌడీల్లారా, కత్తుల్లారా, బ్లేడుల్లారా మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


PS: కొంచెం హెవీ అయినా సందర్భం అలాంటిది కాబట్టి అర్థం చేసుకొని సర్దుకు పొండి:) 

12, ఆగస్టు 2010, గురువారం

మరీ బోడి గుండయ్యేదాకా జుట్టు పీక్కోవద్దని సవినయంగా మనవి

ఈ మధ్య ఒక కామెంట్లో అడిగారు ఎవరు మన రాష్ట్రానికి సరైన నాయకుడు అని. ఇదేందబ్బా.. ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా అడిగేశారు అనిపించింది. పోనీ బ్లాగర్లనడితే ?? అమ్మో..


రౌడీ గారొచ్చి LooooL అని పోతారు. ఆ పేరుండే వాళ్ళని మనం వెదకలేం. శరత్ గారు చూశారంటే, ఈసారి అవకాశం గేలకి ఇమ్మంటాడు. కాకపోతే.. నాయకత్వం కోసం అందరూ నేను గే నేను గే అంటారెమో !! మహేష్ గారికి తెలిసిందో.. అసలు తాడిత, పీడిత జనాలకి తెలియకుండా ఏంటీ ఈ బ్లాగు selection అంటారేమో అని అనుమానం..ఇంకెవరైనా వచ్చి అసలిదంతా.. రామోజీ రావూ, సోనియా గాంధీ, నకిలీ కణిక వ్యవస్థ చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తారేమో అనే జంకు..  అమ్మో ఇంకా ఎంతమంది హేమాహేమీలు  వచ్చి ఏమేమంటారో ! ఎందుకులే..


సరే మనమే చెప్పేద్దాం. మనకేంటి భయం.. అని ఒక్కసారి చుట్టూ చూస్తే, ఆ విషయం తెలియకే..ప్రజలేమో జుట్టు పీక్కుంటున్నారు. అసలు తేల్చిపారెయ్యల్సిందే అని విపరీతంగా బుర్ర చించుకొని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మీద దృష్టి పెట్టానో లేదో..


మహా రాష్ట్ర పోలీసులూ, ఉప ఎన్నికల ఫలితాలూ, వాళ్ళ బామ్మర్దులూ కలసి మూకుమ్మడిగా ఒక పేరు కొట్టేశారు.


ఇంకొకాయనేమో, నా ముక్క నాకు పడేస్తే నే పోతా..నీ బోడి లిస్టులో నా పేరేంది? అని నా పేపరు చింపుకెళ్ళిపోయాడు.


సరే వీళ్ళంతా ఎందుకులే, ఆల్రెడీ సీటు మీద ఉన్నయన్నే ఖరారు చేద్దామంటే.. ఆయనకేమో ఉద్యోగం మాత్రమే కావాలంట. నేను నాయకుణ్ణి కాదుగానీ, నువ్వు నాయకుణ్ణి ఎలాగు కనిపెట్టలేవు కాబట్టి.. ఆ వంకతో నేనలా నడిపించేస్తానంటున్నాడు. చిరాకేసి ఈ పేరు నేనే కొట్టేశా.


ఇంకొకాయనొచ్చాడు..ప్లీజ్ ప్లీజ్ నన్ను సెలెక్టు చెయ్యవా అని. అదేంటంటే నా పరిస్థితేం బాగోలేదు ఏదొ ఒక దారి నువ్వే చూపించాలి అని మరీ ఇబ్బంది పెట్టేసాడు. ఇంతకుముందేదో సిన్మాల్లో చేసిన అనుభవం ఉందంట.. పైగా కావాలంటే ఢిల్లీ వాళ్ళ కాళ్ళూ గడ్డాలు పట్టుకునైనా రికమండేషన్ తెస్తానంటాడు. పోనీ కనీసం నువ్వు సెలెక్ట్ చేసే వాళ్ళ టీం లోనైనా పెట్టుకునేట్టు చూడూ అంటాడు. మనదసలే జాలి గుండె కదా.. కరిగి పోయి పేపరు వైపు చూసి, చెప్పలేక చెప్పేశా.. సారీ బాస్.. అసలు నా లిస్టులో నీ పేరే లేదు అని. ఉండే వుంటుంది.. ఆ ముక్క చింపుకెళ్ళినోడి వల్ల పోయుంటుంది అనుకుంటూ తిరుమల వైపు వెళ్ళి పోయాడు పాపం..


ఇంకొకాయన పాపం నా దగ్గరకి రాలేదు కానీ, పోన్లే మంచోడని నేనే పేరు రాశా లిస్టులో.. పోనీ ఆయన్నే చేద్దాం అంటే.. జుట్టు పీక్కుంటున్న ఫ్రజలందరూ ఒక్క సారిగా, ఆ పని ఆపేసి .. ఆ హ మేమాటైపు కాదు మాకిట్లా మంచోళ్ళు పనికిరారు..కొట్టేయ్ పేరు అన్నారు...ఏం చేస్తాం.. ఈ పేరుకి సత్తా ఉన్నా పత్తాలేకుండా పోయింది.


సరే.. చచ్చో పుచ్చో.. ఆ మిగిలిన పేరునన్నా ఖాయం చేద్దామంటే... ఆయనేమో, ఈ సమస్య మీద జుట్టు పీక్కున్నొళ్ళ నందర్నీ ఓదార్చే పనిలో ఉన్నాడు. ఆ డిల్లీ వాళ్ళేమో అసలు ఆ ఊడిపోయిన జుట్టంతా మాది.. నీకేం సంబంధం ఓదార్చడానికి అంటున్నారు.


మొత్తం మీద అర్థం అయ్యిందేమిటంటే, ఈ సమస్య తీరాలంటే రెండు గొడవలు తేలాల్సిందే.. ఒకటి, ఈ ఓదార్పు గొడవ, రెండు ఆ ముక్క చింపుకెళ్ళేవాడి గొడవా.. ఈ రెండూ తేలేదాకా..నా నిర్ణయాన్ని పెండింగులో పెడుతూ.. ఆ లోపు మరీ బోడి గుండయ్యేదాకా జుట్టు పీక్కోవద్దని ప్రజలకి ఒక ప్రకటన విడుదల చేస్తున్నా.

11, ఆగస్టు 2010, బుధవారం

మావోయిస్టులు-మానవ హక్కులు-మామూలు ప్రజలు

అసలేంటి ఈ గోల? ఏం కావలి వీళ్ళకి? రాజకీయనాయకుల పాత్ర ఏంటి? మనమేం చేయాలి? మధ్యలో ఈ మానవ హక్కుల వాళ్ళ గొడవేంటి? ఒకడేమో హింస వద్దు అంటాడు, ఒకడేమో, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటాడు. చట్టం తన పని తను చేస్తే ఇన్ని గొడవలెందుకసలు? 


హ్మ్.. చాలా ప్రశ్నలు. చాలా వరకు నా ఆలోచనల్ని నా ఆంగ్ల బ్లాగులో ఒక 3 టపాలు రాశానింతకు ముందు.
ఈ రోజే ఒక ఆసక్తికరమైన సర్వే చూసాను. ఆ సర్వె అన్నా తెలుగు బ్లాగ్లోకంతో పంచుకుందామనే ఈ పోస్టు..


2, జులై 2010, శుక్రవారం

బ్రేకింగ్ న్యూస్: వ్యవసాయం దండగ..క్రికెట్టే పండగ -- శరద్ పవార్

శరద్ పవార్ ఐసిసి ప్రెసిడెంట్ అయ్యారు. మంచిదే ప్రపంచ క్రికెట్లో మనవాడు మంచిపదవిలోకి వచ్చాడని ఆనంద పడాలా ఇప్పుడు మనం? దేశానికి వ్యవసాయ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద బాధ్యత ఎలా నెత్తికెత్తుకున్నాడో ఏ విధంగా ఈ జోడు గుర్ఱాలసవారీ సమర్ధవంతంగా చేస్తారో ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదా?


పెద్ద పెద్ద పదవులలో వున్న వాళ్ళు అనేక బాధ్యతలు తీసుకోవలసిన అవసరం వుంటుంది ఒక్కోసారి. అయితే ఆ బాధ్యతలన్నీ రాజకీయ రంగానికో, లేకా ఇంకేదయినా సామాజిక అంశాలకో సంబందించినవయితే పర్వాలేదుకానీ ఇలా ఏకంగా ప్రపంచస్థాయిలో ఐసిసి లాంటి ఒక ప్రొఫెషనల్ సంస్థని నడిపే బాధ్యత తీసుకోవచ్చా? ఆహార సంక్షోభం, ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో సంక్షోభం వంటి సమస్యలు ఇన్ని ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగారికి ఎంత పనుండాలి? 


ప్రజలు పెద్దగా పట్టించుకోరులే అనే ధీమా వల్లే రాజకీయ నాయకుల్లో జవాబుదారీతనం తగ్గిపోతుంది. పట్టించుకోండి.. బాబోయ్.. పట్టించుకోండి..     


ఆ.. పట్టించుకోని.. ఏంచెయ్యాలి?.. మనం పట్టించుకుంటే.. మారిపోతారావీళ్ళు? అసలేంటి నీ సొద అనిపిస్తుంది కదూ..
వెంటనే మనం మార్పు తేలేం గానీ, let's feel about it, think about it and talk about it... who knows we might stumble upon some answers. Yes..at least there is a chance. 

But if we give up, if we ignore and move on...there is not even a chance...

30, జూన్ 2010, బుధవారం

జనాభా గణనలో కులాల వివరాలతో కొత్తగా వచ్చే ముప్పేంటి? ఎందుకీ రాద్ధాంతం?

2011 సెన్సెస్ లో కులాల లెక్కలు సేకరించే అంశం మీద అధ్యయనం చేసే మంత్రుల బృందం రేపు (01 Jul 2010) సమావేశమవబోతుంది.


అసలీ విషయం మీద ఇంత రాద్ధాంతం అవసరమా? ఇరువైపులా అనేక వాదనలు వినిపిస్తున్నయి. ఇరువైపులనుంచీ చాలా వరకు ఉద్దేశ్యాలు మంచివే. నాకయితే, మౌలికంగా ఏదయినా సమాచారాన్నీ, నిజాన్నీ దాచి పెట్టి చెయ్యాలనుకునే మంచి అంతమంచిది కాదనిపిస్తుంది.


కొన్ని వర్గాల వాళ్ళు దీనివల్ల తమకేదో అన్యాయం జరిగిపోతుందనీ, మరికొన్ని వర్గాల వాళ్ళు తమకేదొ ఇబ్బడిముబ్బడిగా మేలు జరిగిపోతుందనీ అపొహలో ఉన్నారు. మరికొంతమందైతే, దీనివల్ల సమాజం పాడైపోతుందేమో, కుల రాజకీయాలు పెరిగిపోతాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇది కేవలం అపోహ మాత్రమే. కుల రాజకీయాలు ఇప్పుడు లేవా? కాకపోతే ఇక ముందు అరిచి గోల చెయ్యడం కాకుండా, సమాచారం మీద ఆధార పడతాయి. ఇది కొంత మంచి పరిణామమే కదా!
కులగణన వల్ల కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు పైగా విలువైన సమాచారం, దానివల్ల ఒనగూడే ప్రయోజనాలు చాలా ఉన్నయి! గత 80 సంవత్సరాలుగా కులాలని లెక్కించలేదు. సమాజంలో కులాల పాత్ర తగ్గిపోయిందా? ఎన్నో పనులకీ, ప్రభుత్వ పధకాలకీ, సాంఘీక అంశాలకీ కులం అనేది ప్రాతిపదికగా ఉన్నప్పుడు, ఒక లెక్కా పత్రం లేకపోతే ఎలా!
అసలు కుల రహిత సమాజం నిర్మించాలనుకున్నప్పుడు ఈ లెక్కలెందుకు? ఇది కుల భావాలని పెంచే చర్య కాదా అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది.


కులరహిత సమాజాన్ని నిర్మూలించాలంటే కాగితం మీద మాత్రం కులం అనేది లేనట్లు నటిస్తే సరిపోదు (Like an ostrich). నా దృష్టిలో ఈ క్రింది అంశాలు అతి ముఖ్యమైనవి. వీటిని సాధించిన తరువాత కుల నిర్మూలన ప్రారంభమయినట్లు లెక్క. ఆ తరువాత కులాల సమాచారం అవసరం ఉండకపోవచ్చు.


1. సామాజిక న్యాయాన్ని కొలిచేందుకు కులం కన్నా మంచి ప్రాతిపదిక తయారు చెయ్యాలి
2. అన్ని కులసంఘాలనీ  రద్దు చేయాలి. (ముందు రాజకీయ నాయకులు ఈ మీటింగులకు వెళ్ళడం మానుకోవాలి)
3. మనలో మార్పుకు సూచికగా మాట్రిమోనియల్ కాలం లో కుల ప్రస్తావన పూర్తిగా నశించిపోవాలి
4. రిజర్వేషన్లూ, ఇతర సంక్షేమ పధకాలూ మరింత టార్గెటెడ్ గా అమలయ్యి, వాటి అవసరం తీరిపోవాలి లేదా మనం పైన చెప్పిన క్రొత్త ప్రాతిపదిక ప్రకారం అమలు చేయబడాలి (ముందు ఈ అంశాల మీద చర్చ ప్రారంభం అవ్వాలి)


ప్రస్తుతం మన సమాజంలో కులం అనేది, ఒక Social reality. దీని గురించిన సమాచారం సేకరించడం ఒక అవసరం.

28, జూన్ 2010, సోమవారం

హేవార్డ్స్, రాయల్ ఛాలేంజి Vs నజర్ సురక్షా ,కుబేర్ కుంజ్

హేవార్డ్స్, రాయల్ ఛాలేంజి అంటే పాపం సోడాలు, పేకముక్కలూ, మంచినీళ్ళ బాటిళ్ళూ అమ్ముకుంటూ చిన్న చిన్న అడ్వర్టయిజ్మెంట్లు వేసుకుంటున్నారు అని నమ్మేవాళ్ళు వుంటారా అని నా సందేహం. మద్యం ఒక వ్యసనం కాబట్టి దాన్ని ప్రోత్సహించే ప్రకటనలు ఉండకూడదు అని ప్రభుత్వాల ఉద్దేశ్యం అయిండొచ్చు.

ఈమధ్య టీవీల్లో వస్తున్న కొన్ని వ్యాపారప్రకటనలు చూస్తుంటే ఈ మద్యం అమ్మే కంపెనీలే బెటరేమో అనిపిస్తుంది. ఒకడేమో, అదేదో నజర్ సురక్షా యంత్రం (దిష్టి తగలకుండా కాపాడే తాయత్తన్నమాట)అంటాడు, ఇంకొకడేమో కొత్తగా కుబేర్ కుంజ్ (కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకొని ధనలాభం పొందడానికి మరి! మన యాడ్ ఏజెన్సీల దృష్టి లో లక్ష్మీ దేవి రేటింగ్ తగ్గిపోయినట్లుంది!)అంటాడు. విరామం లేకుండా గంటపాటు కుమ్మేస్తున్నారు టీవీల్లో.. మన టీవీ చానల్స్ వాళ్ళు మరీ చొద్యం.. ప్రజల్లో మూఢనమ్మకాల మీద, పెరిగిపోతున్న వ్యాపార ధోరణి మీదా, తరిగి పోతున్న మానవీయకోణం మీదా చచ్చు కవితలల్లిమరీ ప్రోగ్రాంలు వేసిన వెంటనే మొదలు పెట్టేస్తారు ఈ కమర్షియల్స్ ని.

ఈవిషయాల్లో పాలసీలు చేసే వాళ్ళ పని పాపం చాలా కష్టమే కదూ!

24, జూన్ 2010, గురువారం

ఇన్నేళ్ళకు గుర్తొచ్చిన రూపాయి..

మన రూపాయికి ఒక చిహ్నం ఉంటే బావుంటుంది అని, కాలేజీ రోజుల్నుంచీ అనుకుంటూ ఉండే వాళ్ళం మేము. ఇన్నాళ్ళకి అది నిజమవుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఐదింట్లోంచి ఒకదాన్ని ఒకట్రెండ్రోజుల్లో ఎంపిక చేస్తారు మనవాళ్ళు.  పెద్ద గొప్ప విషయమేమీ కాకపోవచ్చు కానీ, నేనైతే ఒక మంచి మైలురాయి అవుతుందని ఆశిస్తున్నా! ఏమో..ఎవరికి తెలుసు..

1. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం పోషించబోయే ముఖ్యపాత్రకి ఒక సంకేతం అయ్యుండొచ్చు..
2. వాడకానికి అనువుగా (ease of use) ఉండే పద్దతులమీద మన ప్రభుత్వాలు ద్రుష్టి పెట్టడంలో మొదటి అడుగు ఐయ్యుండొచ్చు..
3. ఆత్మవిశ్వాసం, ఆనందం నిండిన భారతావనికి ఒక ముందస్తు సూచనా అయ్యుండొచ్చు.. 
 

23, జూన్ 2010, బుధవారం

ఇన్నాళ్ళనుంచీ మనం కోరుకున్నదే..ఒడిసి పట్టుకోవడమే తరువాయి..

రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలూ ఏమీ చెయ్యట్లేదనీ, జనాలంతా అవినీతిపరులైపొయారనీ తెగ బాధపడిపోయే చాలా మంది గమనించారో లేదో గానీ, ఈ మధ్యే మన వాళ్ళు చాలా మంచి చట్టం ఒకటి తీసుకొచ్చారు. అదే ప్రాధమిక విద్యా హక్కు చట్టం (Right To Education Act). రాజ్యాంగం Art. 45 లో ఇచ్చిన ఆదేశిక సూత్రం ప్రకారం నిర్భంద, ఉచిత ప్రాధమిక విద్య ప్రతి భావిపౌరుడికీ ఇప్పుడొక హక్కు. ఈ చట్టం అమలులో నిధులు ఎంత మాత్రం అడ్డంకి కాబోవని సాక్షాత్తూ ప్రధాన మంత్రి గారు భరోసా ఇవ్వడం అభినందనీయం. ఆమధ్య నా ఆంగ్ల బ్లాగులో RTE గురించి వీలయినంత సరళంగా వివరించే ప్రయత్నం చేశా. ఒక లుక్కెయ్యండి. (http://weekendpolitician.blogspot.com/2010_04_01_archive.html )


ఈ చట్టం అమలు చెయ్యటం కోసం స్టేట్ లెవెల్లో కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా తయారు చెసారు. ఈ ముసాయిదా మీద ప్రజలు తమ అభిప్రాయాలనూ, సూచనలనూ ఈ నెల 30 లోపు తెలియ చేయవచ్చు.( Draft at http://ssa.ap.nic.in/RTEAct2009/RTE_Model_Rules.pdf    feedback to apssahyd@yahoo.co.in  )




నిరాశావాదుల్నందరినీ కొంచెం సేపు పక్కకునెట్టి, మనమంతా కొద్దిగా participation చేస్తే ఈ చట్టానికి దేశ భవిష్యత్తుని మార్చే శక్తి వస్తుంది. ఈ చట్టం అమలులో సాధ్యమైనంత రోల్ పోషిద్దాం. లేదంటే.. ఎప్పట్లాగే కడుపులో చల్ల కదలకుండా కూర్చోని, మనం తప్ప అందరూ ఈ దేశాన్ని నాశనం చెసేస్తున్నారని ఆయాసపడదాం..

22, జూన్ 2010, మంగళవారం

జై జై సంతలో బానిసలు ...మీకే మా వోట్లు ..

కీలకమైన నిర్ణయాలు చేసే చాలా సందర్భాలలో మన MLA లు హోటళ్ళలోనూ, రిసార్ట్స్ లోనూ గుంపుగా బందింపబడి అసెంబ్లీ లో వోట్లు వేయడం మనకు అలవాటై పోయినట్లుంది. నాయకులమని చెప్పుకొనే వాళ్ళకు కూడా అదో పెద్ద విషయం అనిపిస్తున్నట్లు లేదు. వీళ్ళల్లో ఇంకాస్త పెద్ద నాయకులు మాత్రం, ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఈ బందిఖానాలను ఏర్పాటు చేసి, చూసారా నా దగ్గర ఎంతమంది బానిసలున్నారో!! అన్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు.


సర్లే మనకర్థంగానిదేదో ఉండి వుంటుందిలే అని సరి పెట్టుకుందామన్నా, నాకు ఆశ్చర్యం కలిగించేదేంటంటే, ఇన్నేళ్ళలో ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా "ఇది నా ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తుంది" అని చెప్పి ఆ హోటళ్ళ నుండి బయటకు రాలేదు. వీళ్ళే సంతలో బానిస బ్రతుకులు వెళ్ళదీస్తూ మళ్ళీ ప్రజలకు మాత్రం నాయకులు గా బండి నడిపించేస్తున్నారు.


ఈ మధ్య అన్ని పార్టీల వాళ్ళకీ, "అధిష్టానం ఏం చెప్తే అదే", "ప్రజలేం కోరుకుంటే అదే" అని చెప్పటం fashion అయిపోయింది.


బాబులూ.. ముందు మీరు అధిష్టానానికి ఏమి చెప్తున్నారో, ప్రజలకి ఏం సూచిస్తున్నారో చెప్పి, తర్వాత మీ బానిసత్వం కంటిన్యూ చేసుకుంటే బావుంటుందేమో ఆలోచించండి..

14, జూన్ 2010, సోమవారం

'రావణ్ ' - అదే కథ.. ఒక వర్షన్లో హీరో, ఇంకో దాంట్లో విలన్?

మణిరత్నం గారి 'రావణ్ ' సినిమాలో తమిళ సూపర్ స్టార్ విక్రం హిందీ వర్షన్లో హీరో ట, అదే కథ.. తెలుగు/తమిళ వెర్షన్లలో విలనట! ఇదేదే గమ్మత్తుగా ఉందే.. అనుకుంటున్నాను..


ఇంటినుండి ఫోన్.. ఈ టైం లో చేయరే అని మీటింగ్ లోంచి బయటకి వచ్చి చూస్తే.. మా పిల్లలు ..


ఇద్దరూ కొట్టుకుని ఫోన్ చేసారు. ఇంటికెళ్ళాక, అమ్మాయి మొదట చెప్పిన కథ వింటే 'అయ్యో .. చెల్లి అని చూడకుండా వీడెంత కష్టపెడుతున్నాడు ' అని హృదయం ద్రవించిపోయింది. కోపం గా వాడి వంక తిరిగి చూస్తే.. వాడు అంతకన్నా హృదయ విదారకమైన కథ చెప్పాడు.. విన్నాక నా సింపతీ కాస్తా వాడి మీదకి మళ్ళింది. ఇద్దరూ పెద్ద సత్య సంధులు కారు కాబట్టి ఇద్దరి కథా విని దాని మీద మా పిల్లల్ని చూసే ఆవిడ దృష్టికోణం కూడా అప్లై చేసాకే ఏది కరెక్టో ఒక నిర్ధారణకి రావాల్సి వచ్చింది..


చిన్నపిల్లలతో అయితే .. ఇలాగ కుదురుతుంది కానీ..


ఈరోజు మనం ఒక వార్త సత్యాసత్యాల నిర్ధారణ కి 3-4 దిన పత్రికలు చూడవలసి వస్తుంది. అదే కథ, పాత్రల పేర్లూ అవే.. కానీ ఈనాడు, జ్యోతిల్లో ఒకరు కథానాయకుడు/రాలు ఇతే.. సాక్షి లో వారు ప్రతికథానాయకులు.. అదేవిధంగా వైస్ వెర్సా !


ఏదైనా ఒక పత్రిక లో ఒక పారా చదివి ఒక విషయాన్ని సత్యానికి దగ్గరగా తెలుసుకోగలిగిన రోజొస్తే ఎంత బాగుంటుంది.?

12, జూన్ 2010, శనివారం

వాట్ వుయ్ థింక్ ఈజ్ వాట్ వుయ్ గెట్...

మన రాజకీయాలనీ, రాజకీయ చర్చలనీ చూస్తె నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే, అసలు విషయాన్ని వదిలి, ఎవరో పనికిమాలిన వాళ్ళు మన నెత్తిన రుద్దే మసాలా కబుర్లనే అమాయకంగా రాజకీయ అజెండాగా స్వీకరించేస్తున్నాం చాలా వరకూ!


ఉదాహరణకు, గత రెండు నెలల్లో ప్రాధమిక విద్యా హక్కు చట్టం కంటే, ఏనాయకుడు ఏవర్గంలో ఉన్నాడనే దానిమీదే ఎక్కువ చర్చ జరిగుంటుంది (విద్యా హక్కు చట్టం ప్రాముఖ్యత ఏంటో తెలిసి కూడా). సంక్షేమం,అభివృధ్ది ల గురించి కంటే ఎవరు ఏ పార్టీ లో చేరతారనే దాని మీదే ఎక్కువ చర్చ జరిగుంటుంది కదూ!


అవగాహనా లోపం వల్లో, అలక్ష్యం వల్లో ఎంతోమంది మేధావులూ, విజ్ఞులూ కూడా ఈ ఉచ్చులో పడుతుండడం దురదృష్టకరం . రాజకీయం ఏ విషయాల మీద నడవాలో అజెండా ప్రతిపాదించాల్సింది మనం కాదా? రాజకీయాల ఉచ్చులో మనం పడకుండా మనమే అజెండా నిర్ణయించి, నాయకులే మన దారిలో నడిచేలా చేస్తే ఎంత బాగుంటుందో కదా!  గాడి తప్పుతున్న మన ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రజల ఆదీనంలోకి తెచ్చుకోవడానికి ఏం చెద్దామో, బ్లాగర్లూ మీరే చెప్పండి...

10, జూన్ 2010, గురువారం

2010 లో 1910 నాటి అభిజాత్యం.. సిగ్గుచేటు!

నితిన్ గడ్కారీ గారు హైదరాబాద్ కి వచ్చారు భేష్! సాఫ్ట్ వేర్ ఇంజినీర్లని కలిసి, మాట్లాడి, లాప్ టాప్ బహుమతి పొందారు.. నైస్! పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.. మంచి పని...
అసలే మధ్య తరగతి వాళ్ళు రాజకీయాల నుండి దూరంగా వుండటం నచ్చని నేను, ఎదోలే కనీసం పార్టీలన్నా వీళ్ళ దగ్గరకి వచ్చే ప్రయత్నం చెస్తున్నాయి అని ఆనందపడుతూ టీవీ పెట్టా.. హైదరాబాదు యాత్రలో గడ్కారి గారు ఒక దళిత వాడలో సహపంక్తి భోజనం చేశారనే ఐటం చూసి, నివ్వెరపోయి అర్జెంటుగా కేలండరు చూసా! ఇది 2010 లేక 1910అని.


అన్నీ బాగానే ఉన్నాయి.. దళితులతో (పెద్ద మనసు చేసుకుని..) పెద్ద ఎత్తున చేపట్టిన ఈ 'సహపంక్తి భోజనమే ' మింగుడు పడట్లేదు... అసలేంటి వీళ్ళ ఉద్దేశ్యం? ఈయన గారితోనో లేక ఈయనగారిలాంటి వాళ్ళ తోనో సహపంక్తిలో కూర్చోగలిగితే అదే పదివేలు దళితులకి అనా! లేక చూడండి మేము ఎంత ఉదార స్వభావులమో అనా!
దళితులు గానీ ఇతర అణగారిన వర్గాలు గాని అడిగేది ఆత్మ గౌరవం, సమానత్వం, సమాన అవకాశాలే గానీ ఇతర వర్గాల దయా దాక్షణ్యాలు కాదు కదా!