తీర్పు వచ్చేసింది. భారతీయులంతా ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోతారనే నిరాశావాదులకి కళ్ళు తెరుచుకునేలా ప్రజలు స్పందించారు. అసలు తీర్పు సంగతి అటుంచితే, మన సమాజం 1992 నుండి 2010 లోకి వచ్చేసింది అనేది చాలా సంతోషించవలసిన విషయం అనిపిస్తుంది.
[ఇంతంత సెక్యూరిటీ పెట్టారంటే తీర్పు హిందువులకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టరు 1992 లో చూశాం కదా! అని ఊహాగానాలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అబ్బే.. తీర్పు ముస్లీములకే అనుకూలంగా ఉంటుంది, లేక పోతే వాళ్ళు హిందూ దేవాలయాలన్నింటినీ పేల్చేస్తారు అని నమ్మకంగా నమ్మే వాళ్ళూ కొంతమంది కనిపించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమలాంటి సామాన్య జనాలే అని తెలుసుకోలేని వీళ్ళందరి అమాయకత్వాన్నీ, నిరాశావాదాన్నీ తుంగలో తొక్కే అవకాశాన్ని భారత సమాజం సగర్వంగా అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. తమ అంచనాలు తప్పైనందుకు వీళ్ళు కూడా చాలా సంతోషించి వుంటారు అనేదాంట్లో నాకైతే సందేహం లేదు. ]
అసలు స్థల వివాదాన్ని అధారాలని బట్టీ, న్యాయ సూత్రాలకి అనుగుణంగా కోర్టు ఇచ్చిన తీర్పు చాలావరకూ అమోదయోగ్యంగా వుండడం మంచి పరిణామమే. తీర్పు అన్ని వర్గాలకూ వీలయినంత వరకూ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే సుప్రీం కోర్టులోనో లేదా చర్చల ద్వారానో చూసుకోవచ్చు. ఏనిర్ణయమైనా శాంతియుతంగా స్వీకరించి లోటు పాట్లని ప్రజాస్వామ్య పద్దతుల్లో సవరించుకొనే పరిణతి మన దేశ పౌరులు చూపిస్తున్నారు.
అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వేల పేజీల మొత్తం తీర్పునీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో. అయినా శ్రీరాముడి ఖచ్చితమైన జన్మస్థానంతో ఈ స్థల వివాదానికి సంబంధం ఏంటి? చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాలనుండీ విశ్వసిస్తున్నారు అనే ప్రాతిపదిక న్యాయ నిర్ణయాలకి పనికొస్తుందా? అయినా మత విశ్వాసాలకీ, నమ్మకాలకీ న్యాయ వ్యవస్థ నుండి అమోదముద్ర అవసరం లేదు కదా!
ఒకవేళ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళితే, మిగతా అన్నింటిలోనూ ఈ తీర్పుతో అంగీకరించినా, ఈ ప్రస్తావనని మాత్రం సుప్రీం కోర్టు సరిచేస్తుందని నా నమ్మకం. సుప్రీం కోర్టు వరకూ ఈ కేసు వెళ్ళక పోతే, ఇది కేవలం ఒక పొరపాటుగా మాత్రమే మిగిలి పోవాలనీ భవిష్యత్తు తీర్పులకీ, ఆలోచనా ధోరణులకీ మార్గదర్శకం కాబోదనీ ఆశిద్దాం!
[ఇంతంత సెక్యూరిటీ పెట్టారంటే తీర్పు హిందువులకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టరు 1992 లో చూశాం కదా! అని ఊహాగానాలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అబ్బే.. తీర్పు ముస్లీములకే అనుకూలంగా ఉంటుంది, లేక పోతే వాళ్ళు హిందూ దేవాలయాలన్నింటినీ పేల్చేస్తారు అని నమ్మకంగా నమ్మే వాళ్ళూ కొంతమంది కనిపించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమలాంటి సామాన్య జనాలే అని తెలుసుకోలేని వీళ్ళందరి అమాయకత్వాన్నీ, నిరాశావాదాన్నీ తుంగలో తొక్కే అవకాశాన్ని భారత సమాజం సగర్వంగా అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. తమ అంచనాలు తప్పైనందుకు వీళ్ళు కూడా చాలా సంతోషించి వుంటారు అనేదాంట్లో నాకైతే సందేహం లేదు. ]
అసలు స్థల వివాదాన్ని అధారాలని బట్టీ, న్యాయ సూత్రాలకి అనుగుణంగా కోర్టు ఇచ్చిన తీర్పు చాలావరకూ అమోదయోగ్యంగా వుండడం మంచి పరిణామమే. తీర్పు అన్ని వర్గాలకూ వీలయినంత వరకూ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే సుప్రీం కోర్టులోనో లేదా చర్చల ద్వారానో చూసుకోవచ్చు. ఏనిర్ణయమైనా శాంతియుతంగా స్వీకరించి లోటు పాట్లని ప్రజాస్వామ్య పద్దతుల్లో సవరించుకొనే పరిణతి మన దేశ పౌరులు చూపిస్తున్నారు.
అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వేల పేజీల మొత్తం తీర్పునీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో. అయినా శ్రీరాముడి ఖచ్చితమైన జన్మస్థానంతో ఈ స్థల వివాదానికి సంబంధం ఏంటి? చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాలనుండీ విశ్వసిస్తున్నారు అనే ప్రాతిపదిక న్యాయ నిర్ణయాలకి పనికొస్తుందా? అయినా మత విశ్వాసాలకీ, నమ్మకాలకీ న్యాయ వ్యవస్థ నుండి అమోదముద్ర అవసరం లేదు కదా!
ఒకవేళ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళితే, మిగతా అన్నింటిలోనూ ఈ తీర్పుతో అంగీకరించినా, ఈ ప్రస్తావనని మాత్రం సుప్రీం కోర్టు సరిచేస్తుందని నా నమ్మకం. సుప్రీం కోర్టు వరకూ ఈ కేసు వెళ్ళక పోతే, ఇది కేవలం ఒక పొరపాటుగా మాత్రమే మిగిలి పోవాలనీ భవిష్యత్తు తీర్పులకీ, ఆలోచనా ధోరణులకీ మార్గదర్శకం కాబోదనీ ఆశిద్దాం!

