మన MP ల జీతాలు 16000 నుండి 50000 కి పెంచారు. దాని మీద కొంత వ్యతిరేకతా కూడా వినిపించింది. చాలా మంది ఎందుకు వీళ్ళకి జీతాలు పెంచాలి? ఎలాగూ ఆడ్డదిడ్డంగా తినేస్తున్నారుగా? ఇప్పుడేమైనా ఆపేస్తారా? అని అనుమాన పడుతున్నారు. అసలు పార్లమెంటుకే వెళ్ళరు, వెళ్ళినా పార్లమెంటులో అరుచుకోవడం తప్ప వీళ్ళు చేసేదేముంది అని అనేవాళ్ళు కూడా కొందరున్నారు. అసలు ప్రజాసమస్యలిన్నుంటే వాటిని గాలికి వదిలి తమ సొంత జీతాలకోసం పాకులాడటమేంటనే ధర్మసందేహం కూడా చాలా మందికి కలిగుండొచ్చు..నాకేమనిపిస్తుందంటే,
- ఆసలు MP ల జీతాలు ఇంకా పెంచాలి. ఆదే మోస్తరు ప్రభుత్వోద్యొగులకి ఎంత వుందో కనీసం అంత జీతాలు ఇస్తే నష్టమేంటి? వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే కాదా అనేది చాలా అసందర్భం.
- సేవ చెయ్యడానికి వచ్చినోళ్ళకు జీతాలెందుకు అనేది బేసిక్ ప్రశ్న. అయితే.. ఎవరినైనా ఉచితంగా సేవ చెయ్యమని ఒక సమాజంగా మనమెందుకడగాలి? వాళ్ళు చేసే పనికి న్యాయమైన వేతనం ఇస్తే తప్పేం లేదు కదా!
- జీతభత్యాల వ్యవహారాన్ని నిర్ణయించే పద్దతి మాత్రం కొంత ఎబ్బెట్టుగా ఉంది(ఇప్పుదున్నపరిస్థితుల్లో వేలైనంత బాగానే స్టడీలూ, కన్సల్టేషన్లూ చేశారనుకోండి). ఎంతయినా పాపం వాళ్ళ జీతాలు వాళ్ళే నిర్ణయించుకోవడం కొంచెం ఇబ్బందే (వాళ్ళకీ మనకీ కూడా). ఇండిపెండెంట్ అథారిటీ ఎవరైనా నిర్ణయించే ఏర్పాటు వుంటే బావుంటుంది. (For example, Supreme Court Chief Justice )
ఎలా చేస్తే బావుంటుందంటారు? మీరేమంటారు? ఏంది అబ్బాయా, అన్నీ నువ్వే చెప్పేసి మమ్మల్నడుగుతావు అనకండేం! ఎందుకంటే మీ అందరిదగ్గరా చాలా పెద్ద ఆలోచనల ఖజానా ఉందని నాకు తెల్సు. ఒక్కసారి అప్ప్రైసల్ టైం లో మీరు ఎలా ఆలోచిస్తారో యాద్కి తెచ్చుకోండి.. ఆలోచనలు పరిగెత్తుకుంటూ రావూ!




