31, డిసెంబర్ 2010, శుక్రవారం

శ్రీ క్రిష్ణ కమిటీ ఏం చెప్పొచ్చు !!

తెలంగాణా వస్తుందనీ, రాదనీ, ఇది ఒట్టుట్టి కమిటీ అనీ రక రకాల ఊహాగానాలూ, రాజకీయ ఎత్తుగడలూ జనవరి 6 న రిపోర్టు బహిర్గతం అయ్యే వరకూ సాగుతూనే ఉంటాయి.


సరే కమిటీ ఏం చెప్పడానికి అవకాశం ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ కమిటీ ఒక నిర్ణయాన్ని వెలువరించదు. కొన్ని పరిష్కార మార్గాలనీ, వాటి లోటు పాట్లనీ చెప్పి ప్రభుత్వ నిర్ణయానికి కావలిసిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. తద్వారా ఏదో ఒక పరిష్కార మార్గం వైపుకినడిపించగలిగే అవకాశం ఉంది. స్థూలంగా ఉన్న పరిష్కార మార్గాలు 3:
  1. తెలంగాణా ఇవ్వడం
  2. సమైఖ్యాంధ్రప్రదేశ్ ని కొనసాగించడం
  3. కొన్ని అంశాల (రాయలసీమ, హైదరాబాదు, నీటి వనరులు, ఉద్యోగులు etc.. )పరిష్కారం తరువాత తెలంగాణా ఇవ్వడం
నా దృష్టిలో 3వ మార్గం వైపుగా కమిటీ రిపోర్టు ఉండే అవకాశం ఉంది. అంటే తెలంగాణా ఇవ్వడానికి అంగీకరిస్తూనే, కొన్ని కీలక మైన అంశాలని ఏవిధంగా, ఎంత సమయంలోపు ఎలా పరిష్కరించాలో సూచించి ఆ తరువాత తెలంగాణా ఇవ్వొచ్చు అనే పరిష్కారం వైపు కమిటీ రిపోర్టు మొగ్గు చూపే అవకాశం ఉంది.


2009 డిసెంబరు 10వ తారీఖున ఒక కాంగ్రేస్ వాది కాంగ్రేస్ పార్టీకి సమర్పించిన ఒక నివేదికని నా ఆంగ్ల బ్లాగులో పొందు పరిచాను. చూడాలంటే ఇక్కడ నొక్కండి.